అన్వేషించండి

Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు

Andhrapradesh News: కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాలు దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan Serious On Documents Burnt Issue: విజయవాడలోని (Vijayawada) కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) రికార్డుల దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఆరా తీసిన ఆయన.. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 'అసలు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. భద్రపరిచేందుకు అనుసరిస్తోన్న విధానాలు ఏంటో వెల్లడించాలి.' అని అధికారులకు నిర్దేశించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రికార్డుల దగ్ధం ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడంపై సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే.?

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు కరకట్టపై బస్తాల్లోని దస్త్రాలను తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. అక్కడే ఉన్న స్థానికులు ఏం తగలబెడుతున్నారని ప్రశ్నించారు. అవి ప్రభుత్వ దస్త్రాలని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board)కు సంబంధించిన దస్త్రాలని డ్రైవర్ తెలిపాడు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి.. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో వెంటనే విషయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.

కాలుష్య నియంత్రణ మండలి (PCB), ఏపీ ఖనిజాభివృద్ది(APMDC) సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను దగ్ధం చేశారు. వీటిల్లో కొన్ని హార్డ్‌ డిస్కులు, సీఎంవోకు చెందిన పత్రాలు సైతం ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పరారయ్యేందుకు యత్నించగా పట్టుకున్న డ్రైవర్‌ నాగరాజును గట్టిగా నిలదీయడంతో  పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్ సమీర్‌శర్మ(Sameer Sharma) సూచనలతోనే ఈ ఫైళ్లు తగులబెట్టినట్లు  అంగీకరించాడు. అయితే, దగ్ధం చేసిన ఫైళ్లలో కీలక సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైందని విమర్శించారు. ఇసుక తవ్వకాలపై సీఎం సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే కీలక దస్త్రాలు తగులబెట్టడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
 
వారి పాత్రపై చర్చ
 
మరోవైపు, దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఓఎస్డీ రామారావును విచారణకు పిలిచారు. ఎక్సైజ్ శాఖలో రామారావు సుదీర్ఘకాలం పని చేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా ఆయన అందరితో చెప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటున్నట్లు అంతటా చర్చ సాగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్వోఆర్ విషయాల్లో అక్రమాలకు తెర లేపారనే ఆరోపణలు ఉన్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget