అన్వేషించండి

Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు

Andhrapradesh News: కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాలు దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan Serious On Documents Burnt Issue: విజయవాడలోని (Vijayawada) కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) రికార్డుల దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఆరా తీసిన ఆయన.. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 'అసలు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. భద్రపరిచేందుకు అనుసరిస్తోన్న విధానాలు ఏంటో వెల్లడించాలి.' అని అధికారులకు నిర్దేశించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రికార్డుల దగ్ధం ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడంపై సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే.?

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు కరకట్టపై బస్తాల్లోని దస్త్రాలను తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. అక్కడే ఉన్న స్థానికులు ఏం తగలబెడుతున్నారని ప్రశ్నించారు. అవి ప్రభుత్వ దస్త్రాలని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board)కు సంబంధించిన దస్త్రాలని డ్రైవర్ తెలిపాడు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి.. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో వెంటనే విషయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.

కాలుష్య నియంత్రణ మండలి (PCB), ఏపీ ఖనిజాభివృద్ది(APMDC) సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను దగ్ధం చేశారు. వీటిల్లో కొన్ని హార్డ్‌ డిస్కులు, సీఎంవోకు చెందిన పత్రాలు సైతం ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పరారయ్యేందుకు యత్నించగా పట్టుకున్న డ్రైవర్‌ నాగరాజును గట్టిగా నిలదీయడంతో  పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్ సమీర్‌శర్మ(Sameer Sharma) సూచనలతోనే ఈ ఫైళ్లు తగులబెట్టినట్లు  అంగీకరించాడు. అయితే, దగ్ధం చేసిన ఫైళ్లలో కీలక సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైందని విమర్శించారు. ఇసుక తవ్వకాలపై సీఎం సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే కీలక దస్త్రాలు తగులబెట్టడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
 
వారి పాత్రపై చర్చ
 
మరోవైపు, దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఓఎస్డీ రామారావును విచారణకు పిలిచారు. ఎక్సైజ్ శాఖలో రామారావు సుదీర్ఘకాలం పని చేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా ఆయన అందరితో చెప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటున్నట్లు అంతటా చర్చ సాగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్వోఆర్ విషయాల్లో అక్రమాలకు తెర లేపారనే ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget