అన్వేషించండి

AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీవీకి పోస్టింగ్ - రిటైర్మెంట్ డే రోజునే బాధ్యతలు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP News: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)ను సర్వీసులోకి తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ను ప్రింటింగ్, స్టేషనరీ పర్చేజ్ కమిషనర్ గా నియమించారు.

AP CS Posting To AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswararao) ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా, శుక్రవారమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఇటీవలే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (CAT) ఎత్తేసింది. గురువారం హైకోర్టు సైతం ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని.. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయన్ను ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా నియమించింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆయన సాయంత్రం ఉద్యోగ విరమణ చేయనున్నారు.

'బాధ్యతలు స్వీకరించిన రోజే..'

అటు, బాధ్యతలు స్వీకరించిన రోజే ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 'ఈ రోజు నాకు పదవీ విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. కారణాలు ఏమైనా ఆల్ ఇజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా. ప్రస్తుతం వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నా' అని పేర్కొన్నారు.
AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీవీకి పోస్టింగ్ - రిటైర్మెంట్ డే రోజునే బాధ్యతలు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఐదేళ్లుగా..

టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ హయాంలో పోస్టింగ్ దక్కలేదు. మొదట 6 నెలలు ఆయన ఖాళీగానే ఉన్నారు. తర్వాత రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఆయనపై ప్రభుత్వం మే 31, 2019న సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. 

అయినా, పోస్టింగ్ దక్కకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను (CAT) ఆశ్రయించారు. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సైతం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. 

సీఎస్ ను కలిసిన ఏబీవీ

అయితే, హైకోర్టులోనూ అనుకూలంగా తీర్పు రావడంతో ఏబీవీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఉన్న త న్యాయస్థానం ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారమే ఆయన పదవీ విరమణ చేస్తుండడంతో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా.. రిటైర్మెంట్ రోజునే విధుల్లో చేరి ఆ వెంటనే పదవీ విరమణ చేయనున్నారు.

Also Read: Andhra Pradesh News: సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో చర్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget