అన్వేషించండి

YS Jagan Satires on MLAs: YSRCP ఎమ్మెల్యేలపై సెటైర్ వేసిన సీఎం జగన్ - ఆ ఇద్దరికీ స్వీట్ వార్నింగ్ !

YS Jagan satires on YSRCP MLAs: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన రివ్యూ కాస్త హాట్ హాట్ గా సాగినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లలేదనే రిపోర్ట్ లో వచ్చింది.

YS Jagan Mohan Reddy satires on YSRCP MLAs: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన సమీక్ష కాస్త హాట్ హాట్ గా సాగినట్టు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జ్‌లు ఎవరెవరు ఎంత హుషారుగా గడప గడపకు వెళ్తున్నారనే విషయాన్ని పీకే టీమ్ వివరించింది. కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం 10 రోజులు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లలేదని పీకే టీమ్ ఓ రిపోర్ట్ సీఎం జగన్‌కు ఇచ్చింది. వారి పేర్లను సీఎం జగన్ చదివి వినిపించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు అస్సలు గడప గడపకు వెళ్లలేదనే రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఎవరా ప్రబుద్ధులు అంటూ సీఎం జగన్ జోక్ చేశారు. ఆయన జోక్ చేసినట్టు కాదు, కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఆ ఇద్దరు నేతలు ఆళ్లనాని, ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా గడప గడప కార్యక్రమంలో పాల్గొనలేదని పీకే టీమ్ జగన్ కి రిపోర్ట్ ఇచ్చింది. 

ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?
ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. జగనన్న కాలనీల పట్టాలు పంపిణీ చేశారు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో కూడా హుషారుగా పాల్గొన్నారు. కానీ ఆయన చేసిన తప్పల్లా ఒకటే.. గడప గడపకు అధికారికంగా మొదలు పెట్టకపోవడం. దీంతో ఆయన పేరు లిస్ట్ లో చేరింది. ఆ లిస్ట్ లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో జగన్ కి కోపమొచ్చింది. 

సున్నితంగా హెచ్చరించిన జగన్.. 
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌  ద్వారా సీఎం జగన్ కు పీకే టీమ్ వివరించింది. 22 మంది ఎమ్మెల్యేలు గడప గడప విషయంలో బాగా వెనకపడ్డారని తెలిపింది. కనీసం 10 రోజులు కూడా వారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని పీకే టీమ్ వివరించింది. దీంతో వారిని స్పీడ్ పెంచాలని సున్నితంగా హెచ్చరించారు సీఎం జగన్. ఇక అస్సలు కార్యక్రమమే మొదలుపెట్టని ఆళ్లనాని, ప్రసన్న కుమార్ రెడ్డికి కాస్త ఘాటుగానే తలంటారని తెలుస్తోంది. ఎవరా ప్రబుద్ధులంటూ సెటైర్ వేసిన జగన్.. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారట. 

ప్రజల్లో తిరిగితేనే గెలుస్తారు..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. అదేమీ కష్టం కాదని గతంలోనే ఎమ్మెల్యేలకు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెబుతున్నానని రివ్యూ మీటింగ్ లో చెప్పారు జగన్. తాను చేయాల్సిందంతా తన స్థాయిలో చేస్తున్నానని, ఇక ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాల నిధులిస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు అదనంగా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధులతో స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితాలు ఇలా ఉండవని చెప్పారు. 175 స్థానాలు టార్గెట్ పెట్టుకోవాలని, గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు జగన్. ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలే గెలుస్తారని, తిరగకుండా ఉన్నా, మొక్కుబడిగా తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Amaravati APL Match: అమరావతిలో ఏపీఎల్ క్రికెట్ హంగామా - మ్యాచ్ ప్రారంభించిన హీరో రామ్ చరణ్
అమరావతిలో ఏపీఎల్ క్రికెట్ హంగామా - మ్యాచ్ ప్రారంభించిన హీరో రామ్ చరణ్
AP Electricity Progress Report: విద్యుత్ ట్రూడౌన్ చేసిన మొదటి రాష్ట్రం ఏపీ - విద్యుత్ శాఖ రెండేళ్ల ప్రగతి నివేదిక - చార్జీలు పెంచేది లేదన్న మంత్రి
విద్యుత్ ట్రూడౌన్ చేసిన మొదటి రాష్ట్రం ఏపీ - విద్యుత్ శాఖ రెండేళ్ల ప్రగతి నివేదిక - చార్జీలు పెంచేది లేదన్న మంత్రి
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
AP Employees Retirement Age Increase : ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget