అన్వేషించండి

YSR Achievement Awards: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్

కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కారాలు అందిస్తోందని, ఏపీలో మహానేత వైఎస్సార్ పేరు మీదుగా గొప్పవారిని, అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని సత్కరించుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో గొప్పవారిని పద్మ, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తుంది. ఏపీలోనూ ప్రభుత్వం ఇదే విధంగా కార్యక్రమం చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని వైఎస్సార్ అవార్డులు ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఏపీ ప్రజలకు సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Koo App
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ శ్రీ బిస్వభూషన్ హరిచందన్, సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. తెలుగు సంస్కృతికి, కళలకు, మానవతా మూర్తులకు, సామాన్యులుగా కనిపించే అసామాన్యుల ఇస్తున్న గొప్ప అవార్డులు ఇవి అని సీఎం వైయస్ జగన్ తెలిపారు. ప్రతి ఏటా నవంబర్ 1న ఈ అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. @ysjagan #YSRAwards - CMO AndhraPradesh (@AndhraPradeshCM) 1 Nov 2021

డాక్టర్‌ వైఎస్సార్‌ అంటే నిండైన తెలుగుదనం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహానేత, డా. వైఎస్సార్ పేరు చెబితే ప్రజలకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. రైతులు, వ్యవసాయం మీద మమకారంతో గ్రామం, పల్లెల మీద మా ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రతి ఒక్కరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తేనే కనిపించే విషయాలని గుర్తుచేశారు.

Also Read: వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభం.. తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్న వాలంటీర్లు

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చూసినా ప్రజా సంక్షేమమే కనిపిస్తోంది. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం నుంచి మొదలుపెడితే.. ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధను తీసుకొచ్చాం. వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు.  

ప్రజల్లో చిరస్థాయిగా గుర్తిండి పోయే నేత కనుకనే ఆయన పేరు మీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇస్తున్నాం. వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలతో పాటు కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నామని ఏపీ సీఎం వివరించారు.

Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌లైన, కళలకు, సంస్కృతికి ఈ ఆవార్డులలో పెద్దపీట వేశారు.  కళాకారులకు అరుగైన గౌరవం అందించాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్ధల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, మనదైన కలంకారీకి, నాదస్వరానికీ, కూచిపూడికి సంబంధించి అందరూ కళాకారులను గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించిన వారిని ప్రత్యేకంగా సన్మానించారు.

వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ కి, సీపీ బ్రౌన్‌ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, ఆర్డీటీ సంస్ధకి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ లాంటి సంస్థలకు, రైతులకు, కలం యోధులకూ అవార్డులు ఇచ్చారు. కవులకు, స్త్రీవాద ఉద్యమానికి,  సామాజిక స్పృహను మేల్కొల్పడంలో సేవలు అందించిన రచయితలకు, విశ్లేషక పాత్రికేయలకు గౌరవం కల్పించేలా అవార్డులు ఇచ్చామని.. ఇక ప్రతి ఏటా నవంబరు ఒకటో తారీఖున ఈ అవార్డులు ఇస్తాంమని సీఎం జగన్ పేర్కొన్నారు.

Also Read: ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget