అన్వేషించండి

Jagan, Chandrababu Delhi Tour: ఒకేరోజు ఢిల్లీకి జగన్‌, చంద్రబాబు - ఆసక్తికరంగా మారిన ఆ మీటింగ్‌!

పరస్ఫర ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు ఒకే రోజు ఢిల్లీకి వెళ్లడం.. ఒకే సమావేశానికి హాజరు కావడంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.

CM Jagan, Chandrababu Delhi Tour: సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రోజు ఢిల్లీ వెళుతున్నారు. డిసెంబరు 5న రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి వారు హాజరుకానున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇద్దరూ పాల్గొనబోతున్నారు. ఉన్నపళంగా ఇద్దరూ ఒకే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి.. భారత్‌ జీ - 20 (G 20 Summit) దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తోంది. డిసెంబర్‌ 1వ తేదీ 2022 నుంచి 2023 నవంబర్‌ 30వ తేదీ వరకు జీ - 20 (G 20 Summit) దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది. రాష్ట్రపతి భవన్‌లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సలహాలు తీసుకునేందుకు కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది.

అందుకే అన్ని పార్టీలకు ఆహ్వానం అందించింది. అంతేకాదు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌తో పాటు చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్‌ పంపించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో డిసెంబర్‌ 5వ తేదీన హస్తినకు వెళ్లనున్నారు ఇరువురు నేతలు. దీంతో సీఎం జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. 

పరస్ఫర ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు (CM Jagan, Chandrababu) ఒకే రోజు ఢిల్లీకి వెళ్లడం.. ఒకే సమావేశానికి హాజరు కావడంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో 32 రంగాలపై కేంద్రం 200 లకి పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే జీ - 20 సమావేశ (G 20 Summit Agenda) ఎజెండా కోసం అఖిలపక్ష భేటీలో అభిప్రాయాలు తీసుకోనుంది. కూటమికి నాయకత్వం వహించాల్సిన, భారత్ తీసుకోవాల్సిన బాధ్యత పైన చర్చించి.. పార్టీల అధినేతల నుంచి సలహాలు స్వీకరించే క్రమంలో భాగంగా ఆ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సమావేశంలో సీఎం జగన్‌, చంద్రబాబు ఎదురుపడితే పలకరింపులేమైనా ఉంటాయా? లేదంటే నమస్కారాలు, ప్రతి నమస్కారాలైనా ఉంటాయా? అసలు వీరు ఎదురుపడతారా? అనేది చూడాలి.

గత ఆగస్టు 15న ఒకే కార్యక్రమానికి ఇద్దరూ, కానీ..

గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించేలాగానే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhusan Harichandan) ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. వీరు వేర్వేరుగా కార్యక్రమానికి హాజరైనా ఎదురుపడతారేమోనని తొలుత అందరూ భావించారు. కానీ, ముందుగా చంద్రబాబు హాజరై గవర్నర్ దంపతులను కలిసి వెళ్లిపోయారు. చంద్రబాబు వెళ్లిపోయాక సీఎం జగన్ ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Kidney Damage Symptoms : కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Embed widget