అన్వేషించండి

CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

AP Rains: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం మరోసారి అధికారులతో సమీక్షించారు. విజయవాడ సింగ్ నగర్‌లో జోరు వర్షంలోనూ మరోసారి బోటులో ఆయన పర్యటించారు.

CM Chandrababu Visited Flood Effected Areas In Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం ఆయన విజయవాడ (Vijayawada) కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని.. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయని.. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలని అన్నారు. బాధితులకు సమీపంలోని కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. బోట్లలో వచ్చిన వారిని  తరలించేందుకు బస్సులు సిద్ధం చేయాలని చెప్పారు. వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడకుండా హోటళ్లలో ఉంచాలని అన్నారు.

విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్

విజయవాడలో ఆదివారం సాయంత్రం బోట్లలో పర్యటించిన సీఎం అప్పటినుంచి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిస్తూనే ఉన్నారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పవర్ బోట్స్ పంపాలని కోరగా.. సోమవారం ఉదయానికి అవి విజయవాడ చేరుకున్నాయి. ఈ బోట్స్ ద్వారా పూర్తిగా నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతంలో ఆహారం పంపిణీ చేపట్టారు. పెద్దఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. 

జోరువానలోనూ సీఎం పర్యటన

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకూ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్విరామంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు ఆహారం, తాగునీరు అందుతున్నాయా లేదా.? అనేది ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం వారికి ధైర్యం చెప్పారు. సోమవారం ఉదయం జోరు వానలోనూ సింగ్ నగర్‌లో మరోసారి ఆయన పర్యటించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా లేదా అనేది ఆరా తీశారు. తనతో సహా అధికారులంతా బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.
CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

'వరద బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలి. హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలి. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలి. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలి. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ సాయం అందుతుంది.' అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Also Read: Vijayawada Flood: బెజవాడ దుఃఖదాయని బుడమేరు వరదలకు కారణమేంటీ? మానవ తప్పిదమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget