అన్వేషించండి

CM Chandrababu: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి అవసరమైన చోట్ల వసతి గృహాలు, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhrapradesh News: రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు అవసరమైన ప్రతి చోట వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Good News To Women Employees: రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగినులకు అవసరమైన ప్రతి చోటా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. ఉద్యోగినుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైతే డివిజన్ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, వసతి గృహాల చెంతనే పిల్లల సంరక్షణకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. తొలుత ప్రభుత్వమే మహిళా వసతి గృహాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కానీ వీటిని నిర్వహించనున్నారు. ఈ హాస్టల్స్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం అధికారులకు నిర్దేశించారు.

అంగన్వాడీల అభివృద్ధిపై..

రాష్ట్రంలో అంగన్వాడీల అభివృద్ధిపైనా సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నింటిని అదే స్థాయిలో ఉంచాలి.?. ఎన్నింటిని ఉన్నతీకరించాలనే దానిపై సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేపట్టాలని అన్నారు. అలాగే, దాతల అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే 'మేము సైతం' కార్యక్రమాన్ని కూడా తిరిగి అమలు చేయాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్, 8,455 కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. రానున్న 3 నెలల అన్నీ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల పనుల్ని పూర్తి చేయాలని నిర్దేశించారు. దీని కోసం కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.

ధరల నియంత్రణపై..

రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పని చేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, కందిపప్పు సహా మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని సూచించారు. రానున్న రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అలాగే, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై తగిన ప్రతిపాదనలతో రావాలని నిర్దేశించారు.

'వారి ఆర్థిక భద్రత మా బాధ్యత'

రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తన భాద్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు తొలి రోజే 64 లక్షల మందికి ఇళ్ల వద్దే పంపిణీ చేయడం పూర్తి సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 97.54 శాతం మందికి పింఛన్లు అందించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఒకటో తేదీనే అందించినట్లు వివరించారు.

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Chhattisgarh ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Embed widget