అన్వేషించండి

Jagananna Colonies : ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నాం, తక్కువ ధరకే సిమెంట్ స్టీల్ - ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్

Jagananna Colonies : ప్రభుత్వం పథకానికి అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అని చూడకుండా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశామన్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

Jagananna Colonies : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(CM Jagan) మాట్లాడారు. ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై సుదీర్ఘమైన చర్చ జరిగిందన్నారు. మంత్రి రంగనాథరాజు కూడా ఈ పథకంపై వివరణ ఇచ్చారన్నారు. ప్రతి ఎమ్మెల్యే(MLA) తన నియోజకవర్గంలో ఫలానా పని నేను చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెడితే నాకు పెన్షన్‌ రాలేదనో, ఇల్లు లేదనో, ఫలానా స్కీం అందలేదనో, అర్హత ఉండి కూడా రాలేదనే పరిస్థితులు ఇవాళ లేదన్నారు. ప్రతి శాసనసభ్యుడు సగర్వంగా కాలర్‌ ఎగరేసుకునే పరిస్థితుల్లోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా అమలుచేస్తున్నామన్నారు. పథకంలో అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అని చూడడంలేదన్నారు. 

30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 

రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల(Land Deeds) పంపిణీ చేశామని సీఎం జగన్ అన్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇది పూర్తయితే 30.76 లక్షల అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి అందించే గొప్ప కార్యక్రమం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరిగేలా ఈ కార్యక్రమం అమలుచేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి 71,811 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఈ భూమి విలువ కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుందన్నారు. 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించి 2.62 లక్షల ఇళ్లు కూడా ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17,005 కాలనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే, కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయన్నారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్‌ గ్రామ పంచాయితీ సైజులో కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. అందుకే ఇవాళ ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని సభలో సీఎం జగన్ అన్నారు. 

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు 

 "రాష్ట్రంలో 17,005 వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలిదశలో 10,067 కాలనీల్లో  ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు కడుతున్నాం. మొత్తం రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోదీ(PM Modi)కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీలలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్‌ ఇటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్కూల్స్, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దీనికి కొద్ది సమయం పడుతుంది." అని సీఎం జగన్ అన్నారు. 

తక్కువ ధరకే సిమెంట్, ఐరన్

గతంలో చంద్రబాబు హయాంలోఇంటి విస్తీర్ణం రూరల్‌లో ఇంచుమించు 215 చదరపు అడుగులు ఇచ్చారని,  ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు ఉందన్నారు. ప్రతి ఇంట్లో బెడ్రూం, లివింగ్‌ రూం, కిచెన్, బాత్రూమ్‌ కమ్‌ టాయ్‌లెట్, వరండా ఉంటాయన్నారు. అందులో భాగంగానే సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా డోర్లు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ సామాగ్రి వంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని తీసుకువచ్చామన్నారు. ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ పడుతుందన్న సీఎం... మామాలుగా మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉందన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్లకు మాత్రం సిమెంట్‌ కంపెనీలతో మాట్లాడి వారిని ఒప్పించి పీపీసీ సిమెంట్‌ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేటట్టు మాట్లాడామన్నారు. ప్రతి లబ్దిదారుడికి 20 టన్నుల ఇసుక అవసరమైతే అది కూడా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తున్నామన్నారు. దాదాపుగా 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను మార్కెట్‌ రేటు కన్నా తక్కువకే ఇస్తున్నామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget