అన్వేషించండి

YSRCP : చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ - మరో దళిత నేత రాజీనామా

YSRCP : వైఎస్ఆర్‌సీపీకి మరో దళిత నేత రాజీనామా చేశారు. దళితులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Another Dalit leader resigned from YSRCP :  చిత్తూరు జిల్లా వైసీపీకి  వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ రాజీనామా చేశారు.  మెయిల్ ద్వారా జగన్ రెడ్డికి రాజీనామా పంపిపిన మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ  మీడియా సమావేశంలో వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.  
12 ఏళ్లుగా వైసీపీలో ఉన్నారు ఆర్. గాంధీ.  వైసీపీ లో దళితులకు అన్యాయం జరుగుతోందని..  దళితుల బాధలను, కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే అపాయింట్మెంట్ దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గత నెల రోజుల్లో సుమారు వెయ్యి సార్లు జగన్ రెడ్డికి కాల్ చేశాను కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. 

12 ఏళ్లుగా వైసీపీలో ఉన్న  ఆర్.గాంధీ                                   

ఓ దళిత మాజీ ఎమ్మెల్యేని అయిన నాకు వైసీపీలో అవమానం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానని ప్రకటించారు.  నాడు అమర్నాథ్ రెడ్డి   ఆధ్వర్యంలో నేను వైసీపీలో చేరాను.  అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనను చిన్నచూపు చూస్తూ వస్తున్నారని విమర్శించారు.  పార్టీ పరంగా దక్కాల్సిన అవకాశాలను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దూరం చేస్తూ, అడ్డుపడుతూ వచ్చారని..  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితుల పైన, బీసీల పైన దాడులు పెరిగాయిని  విమర్శించారు.  వైసీపీ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా నేడు నేను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. 

పెద్దిరెడ్డికి బానిసత్వం చేసే వారికే టిక్కెట్లు                             

చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గంగాధర నెల్లూరులో జరగనున్న  రా... కదలిరా... సభలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాననని తెలిపారు.  దళితులకు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది, దీనిని ప్రశ్నించేందుకు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను.  నేడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం నడుస్తోందన్నారు.  పెద్దిరెడ్డికి బానిసలుగా ఉన్నారో, అనుకూలంగా ఉన్నారో వారికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్లు వస్తున్నాయని మండిపడ్డారు.  జిల్లాలో వైసీపీకి  కోనేటి ఆదిమూలం గొప్ప సర్వీస్ చేశారు. అలాంటి దళిత నాయకుడికి కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.  పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకి కూడా సీటు లేకుండా చేశారు.  వైసీపీలో కేవలం దళిత ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.  వైసీపీ చేస్తున్న అవినీతి, అక్రమాల మీద పోరాటం చేస్తానని  ప్రకటించారు. 

చిత్తూరు జిల్లా వైసీపీలో టిక్కెట్ల మార్పు కలకలం     

చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్ల మార్పు వ్యవహారం కలకలం రేపుతోంది. ముందుగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మార్చడం వివాదాస్పదమవుతోంది. డిప్యూటీ సీఎంకు కూడా మొదట ఎంపీ టిక్కెట్ ప్రకటించి తర్వాత ఎమ్మెల్యేగా మార్చారు. సత్యవేడు ఎమ్మెల్యేకూ అదే విధంగాచేయడంతో ఆయన మనస్తాపానికి గురై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget