అన్వేషించండి

Pattiseema water release : పట్టిసీమ నుంచి నీరు విడుదల - రోజుకు ఏడు వేల క్యూసెక్కులు రిలీజ్ !

Water For Krishna Delta : పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేశారు. రోజుకు ఏడు వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Water released from Pattiseema to Krishna Delta : కృష్ణా డెల్టాలో తీవ్రమైన నీటి కొరత ఉండటం గోదావరికి వరద వస్తూండటంతో ప్రభుత్వం పట్టి సీమ ద్వారా నీటిని విడుదల చేసింది.   పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు.  ఉదయం 7.27 ని.లకు   జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ స్విచ్చాన్ చేశారు.  పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా డెల్టా కు సాగు, తాగు నీటి అవసరాలకు పోలవరం కుడికాలువ ద్వారా తరలిస్తున్నారు. పట్టిసీమ నుండి రోజుకి 7 వేల క్యూసెక్కుల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ ఏడాది తొలిసారి పట్టిసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు  నిర్వహించారు. 

పోలవరం ముంపు మండలాలు విలీనం చేయించడం చంద్రబాబు ముందు చూపు 
 
నదుల అనుసంధానం ద్వారా మాత్రమే దేశాన్ని కరవు రహితంగా మార్చగలమని నిమ్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.  దేశంలో ఆ ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేయించడం చంద్రబాబు నాయుడు ముందుచూపునకు నిదర్శనమని..   పోలవారం ప్రాజెక్ట్ ఆలస్యం జరుగుతుంది కాబట్టే పట్టసీమను చేపట్టారు.. దీని ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని గుర్తు చేశారు.          

జగన్ పాలనలో అంతా విధ్వంసమే 

గతంలో పట్టిసీమను మాజీ సీఎం జగన్‌ ఒట్టిసీమ అని ఎద్దేవా చేశారు.. కానీ, ఇప్పుడు అదే బంగారమైంది.. పట్టిసీమ పుణ్యమా అని కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుంది.. జగన్ పాలన అంతా విధ్వంసాలే.. తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. అని వ్యాఖ్యానించారు. పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేయకపోతే లక్షలాది ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తారు? ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.  తాడిపూడి నుంచి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం.. ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వ వల్ల స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ నగరానికి తాగునీరు అందుతుంది.. ఏలేరులో నీటి నిల్వకు ప్రయత్నిస్తున్నామని గుర్తు చేశారు. ఒకే రోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం చరిత్రాత్మకం… అధికారులతో సమన్వయం చేసుకుని నీటి నిర్వహణ సమర్థంగా చేపడుతున్నామన్నారు. 

 పట్టిసీమ ద్వారా పోలవరం ఫలాలు

 పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయి  మంత్రి రామానాయుడు అన్నారు. ఇక, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అటు కృష్ణా డెల్టాలో వేలఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ ద్వారా నీటి తరలింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నాలుగేళ్లలో కేవలం 60 టీఎంసీలు వరకు మాత్రమే ఎత్తిపోశారని..రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan DSC 2025: ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఖాతాలు బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు- డీఎస్సీపై వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
Andhra Pradesh Top News: పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
PRC ఏర్పాటుకు నిర్ణయం, అక్టోబర్ 1 నుంచి 2 డీఏలకు ఆమోదం- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
AP Zilla Parishads: ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు
ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు.. జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటుకు ఉత్తర్వులు

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget