అన్వేషించండి

Breaking News Live: కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

Background

ప్రముఖ చిత్రకారుడు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల కథా రచయితగా ఆయన చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన డుంబు పాత్ర సుబ్బరాయశాస్త్రికి చాలా పేరు తెచ్చింది.

ప్రముఖ కవి, సినీ గేయరచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931 లో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి జన్మించారు. మిగతావారిలా స్కూలుకు వెళ్లకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. చిన్నతనంలో తండ్రి కృష్ణశాస్త్రి వెన్నంటే ఉండేవారు. దాంతో ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగే అవకాశం కలగడంతో ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రముఖ కవి, రచయిత శ్రీశ్రీ ఓ సభలో బోరు కొడుతుందని సుబ్బరాయశాస్త్రిని షికారుకు తీసుకెళ్లి ఆడించారు. ఇలా ప్రముఖులతో చిన్ననాటి నుంచి కొత్త విషయాలు, జీవితాన్ని నేర్చుకున్నారు. వాటిని బొమ్మల రూపంలో, చిన్న పిల్లల కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన వారిలో ఈయన ఒకరు.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి 17 ఏళ్ల వయసులో బుజ్జాయి ‘బానిస పిల్ల’ అనే బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్తగా నిలిచారు. చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పంచతంత్ర కథలకు ఎంతో అందమైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయన భైరవ్, పెత్తందార్, డుంబు కామిక్ స్ట్రిప్పులను చేశారు.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తన కుమారునికి తండ్రి పేరు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి పేరు పెట్టారు. సుబ్బరాయశాస్త్రి కుమారుడు కూడా రచయిత. ఓ కుమార్తె రేఖా సుప్రియ, బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్‌ కూడా రచయిత్రి అయ్యారు.

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక 1975లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. ప్రముఖులతో తాను నేర్చుకున్న విషయాలు, అనుభవాలను ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ‘నవ్వులబండి - డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్నిరాసి చిన్నారులకు వినోదాన్ని పంచారు.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు భారీగా తగ్గింది. తులానికి ఏకంగా రూ.400 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.800 తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,640 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.800 తగ్గి రూ.67,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,700గా ఉంది.

20:44 PM (IST)  •  28 Jan 2022

కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. రూ. కోటి నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ లో ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 

17:56 PM (IST)  •  28 Jan 2022

విష గుళికల నీరు తాగి 8 నెమళ్లు మృతి

వరంగల్ జిల్లా  పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండలో ఒకే సారి 8 నెమళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. రైతులు పొలంలో చల్లేందుకు ఉంచిన విష గుళికల నీటిని తాగి నెమళ్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నెమళ్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విష గుళికలు కలిపిన నీరు తాగడం వలన చనిపోయాయా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నెమళ్లను చంపారనే కోణంలో విచారణ చేపట్టారు. 8 నెమళ్లు ఒకే సారి చనిపోవడంపై జిల్లా అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

16:46 PM (IST)  •  28 Jan 2022

హైదరాబాద్ లో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు 

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాక్సిన్ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు అందిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్ లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

16:46 PM (IST)  •  28 Jan 2022

హైదరాబాద్ లో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు 

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాక్సిన్ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు అందిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్ లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

16:22 PM (IST)  •  28 Jan 2022

వనమా రాఘన బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వనమా రాఘవ బెయిల్ పిటిషన్ ను కోర్టు నిరాకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వనమా రాఘవ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన స్థానిక కోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది.

13:43 PM (IST)  •  28 Jan 2022

చంద్రబాబు జగన్‌ను అభినందించాలి: ఎమ్మెల్యే వల్లభనేని

‘‘కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్మోహన రెడ్డిని అభినందించాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టకలేకపోయాడు. జిల్లాకు పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కనీసం అభినందించటంలేదు. చంద్రబాబు నాయుడు నుంచి ఈనాడు నాలాంటి ఎంతో మంది నాయకులు పదవులు అనుభవిస్తున్నారంటే అన్న ఎన్టీఆర్ పెట్టిన భిక్షే. గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు పెడతానంటే అమాట చంద్రబాబు నాయుడు కు చెబుతే ఎద్దేవా చేశారు. ఇప్పుడు అవాస్తవాలు బయట నేను మాట్లాడితే రాజకీయంగా మాట్లాడారు అనుకుంటారు.’’ అని వల్లభనేని వంశీ మాట్లాడారు.

13:33 PM (IST)  •  28 Jan 2022

రాజంపేటలో నిరసనలు

రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నగరం నడిబొడ్డున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రం అయ్యాయి. అన్నమయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలతో రాజంపేట దద్దరిల్లింది. రాస్తారోకో, ధర్నాలను అడ్డుకోవాలని అడుగడునా పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటకీ విద్యార్థులు యువజన సంఘాల నాయకులు రోడ్డు పై బైఠాయించారు. ఈ ఆందోళనలకు రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు మేడా విజయ్ శేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మేడా విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, అన్నమయ్య పుట్టిన రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రాజంపేటకు ఎంతో పాశస్త్యం  ఉందని ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేయకముందే సీఎం జగన్ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు.

12:04 PM (IST)  •  28 Jan 2022

ఓయూలో ఉద్రిక్త వాతావరణం.. పెట్రోల్ బాటిల్‌తో వ్యక్త హల్ చల్

ఓయూ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ నేతలను ఓయూ విద్యార్థి సంఘాలు అడ్డుకుంటామంటూ తేల్చి చెప్పాయి. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించాకే ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తుండగా.. ఆర్ట్స్ కాలేజీ దగ్గర పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. టీఆర్‌ఎస్‌ నేతలు వర్సిటీలోకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

11:42 AM (IST)  •  28 Jan 2022

ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ

సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను ఆర్టీసి ఎం.డి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకార్యార్ధం తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసి నిలకడగా ఉందని.. త్వరలోనే ఆర్టీసి లాభాల్లో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కావున ప్రయాణికులు భయపడకుండా సురక్షితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చని అన్నారు. అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసికి మంచి లాభాలు ఉండే హైదరాబాద్ నుండి జహీరాబాద్ రూట్ లో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. ఆర్టీసి అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

11:10 AM (IST)  •  28 Jan 2022

సాహితీ వేత్త ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్‌ కన్నుమూత

ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సుధాకర్‎కు భార్య స్వర్గీయ డా.పుట్ల హేమలత (ప్రముఖ రచయిత్రి). వీరికి ఇద్దరు కుమార్తెలు మానస, మనోఙ్ఞ. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 న నిజామాబాద్‎లోని పాముల బస్తిలో జన్మించారు. ఈయన తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో 28 ఏళ్లు పని చేశారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులకు గైడ్‎గా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‎గా పని చేస్తున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget