అన్వేషించండి

Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

Background

మెరుగైన పీఆర్సీ సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. కృష్ణా జిల్లా విజయవాడలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఈరోజు ఉదయం 11:30 గంటలకు నేడు మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
 
ఎట్టకేలకు ఏకమైన ఉద్యోగ సంఘాలు
ఏపీలో ప్రధానంగా క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాలు 4.. ఇవి రెవెన్యూ ఉద్యోగుల సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత సూర్య నారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామి రెడ్డి  ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీరిలో మిగిలిన సంఘాల నేతలకు సచివాలయ ఉద్యోగ సంఘనేత వెంకట్రామిరెడ్డికీ మధ్య సిద్ధాంత పరంగా కొన్ని విభేదాలు ఉన్నాయని చెబుతుంటారు . అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వీరంతా ఏకం అయ్యారు . దానికోసం విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకతాటిపైకి రావాలని నిర్ణయించారు. 
 
ఇకపై మేమంతా ఒకటే.. 
పీఆర్సీపై పోరుకోసం తామంతా ఏకమయ్యామన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సచివాలయంలో ఈరోజు తామంతా కలిసి చర్చించనున్నట్టు ఆయన  తెలిపారు. మెరుగైన పీఆర్సీ సహా తమ ఇతర డిమాండ్ల పై ఇందులో చర్చిస్తామన్నారు. సమావేశంలో జరిగిన చర్చలను జేఏసీ సమావేశంలో తెలియజేస్తామన్నారు. ఈరోజు జరిగే సమావేశం తర్వాత  సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామనీ, సమ్మె నోటీసుపై వెనక్కి తగ్గేది లేదనీ అన్న బొప్పరాజు , అన్ని ఉద్యోగసంఘాలూ కలిసి శుక్రవారం నాడు  ఉమ్మడి కార్యాచరణను  తెలుపుతాయని స్పష్టం చేశారు. 

ఉద్యోగులు పీఆర్సీ పై భయపడుతున్నారు: సూర్యనారాయణ 
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుందన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించాలనీ, జీతాల కోత తప్పదనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొని ఉందన్న విషయం అధికార యంత్రాంగం అర్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్య నారాయణ అన్నారు. ఇకపై తమందరిదీ ఒకటే మాట అని, తమపోరాటం చరిత్రలో నిలబడిపోతోందని చెప్పారు. 
 
ప్రభుత్వం ఈగోలకు పోవద్దు : వెంకట్రామిరెడ్డి
ఏపీ ప్రభుత్వం అనవసర ఈగోలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులందరి సమస్య ఒకటే కాబట్టి ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్న వెంకట్రామి రెడ్డి, ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

21:55 PM (IST)  •  21 Jan 2022

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ ఎన్ నగర్ లో  ఘటన జరిగింది.  ఎల్ నగర్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న వీణ (38) లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రమాదవశాత్తు మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

14:16 PM (IST)  •  21 Jan 2022

తెలంగాణలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.404.82 కోట్లతో అనుమతులు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం 404.82 కోట్ల రూపాయల్లో 250.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా 154.80 కోట్లు రైల్వేశాఖ భరిస్తుందని తెలిపారు.

1.చటాన్ పల్లి-షాద్ నగర్
2.ఆదిలాబాద్ మార్కెట్ యార్డు
3.పెద్దపల్లి టౌన్
4.మాధవనగర్,నిజామాబాద్

14:07 PM (IST)  •  21 Jan 2022

వచ్చే నెల 7 లేదా ఎనిమిది నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మె బాట

అమరావతి..  వచ్చే నెల ఏడు లేదా ఎనిమిది నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టనున్నాయి. అంతకుముందే ఫిబ్రవరి 3 ఛలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. 

మరోవైపు ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్ల పెంపునకు క్యాబినెట్ అంగీకరించింది. కరోనా కట్టడిపై సుదీర్ఘంగా చర్చ చరిపారు. క్యాబినెట్ చివరిలో ఉద్యోగుల డిమాండ్లపై మంతులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.

11:43 AM (IST)  •  21 Jan 2022

నేడు ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్

ఈ రోజు ఎంపీ బండి సంజ‌య్ పార్లమెంట్‌ ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రు కానున్నారు. ఇందుకోసం గురువారం బండి సంజ‌య్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రివిలేజ్ క‌మిటీ ముందు ఎంపీ బండి సంజ‌య్ హాజ‌రు అవుతారు. తెలంగాణ పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన విధానాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ క‌మిటీ తెలియ‌పరుస్తారు. కాగా ఉద్యోగుల బ‌దిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజ‌య్ డిమాండ్ చేస్తూ దీక్ష చేశారు. అయితే బండి సంజ‌య్ దీక్ష స‌మ‌యంలో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

11:14 AM (IST)  •  21 Jan 2022

చినజీయర్ స్వామి వద్దకు మంత్రి హరీశ్ రావు

శంషాబాద్ మండలం పరిధిలోని ముచ్చింతల గ్రామం శ్రీ రామ నగరంలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరిలో జరిగే శ్రీరామానుజ ఉత్సవాల కార్యక్రమాల వివరాలను మంత్రి హరీష్ రావు చిన్న జీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను, యాగంలో ఉపయోగించే ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు మంత్రి హరీష్ రావు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.

10:50 AM (IST)  •  21 Jan 2022

యూకేలో జాబ్ ఇప్పిస్తామని రూ.11 లక్షల మోసం..

* యూకేలో జాబ్ ఇప్పిస్తామని రూ.11 లక్షల మోసం..

* యూకేకి వీసాతో పాటు అక్కడే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన సైబర్ చీటర్స్

* ఆర్బీఐ చెన్నై బ్రాంచ్ నుండి కాల్ చేస్తున్నామని ప్రాసెసింగ్, ఇతర చార్జీల పేరుతో రూ.11.14 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు

* హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ వసీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

* కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

09:24 AM (IST)  •  21 Jan 2022

శ్రీవారి సేవలో అక్కినేని నాగార్జున దంపతులు

తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం‌ పలికి దర్శన‌ ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకోలేక పోయామని, ఇవాళ స్వామి వారి ఆశీస్సులు పొందామని అన్నారు. అలాగే ఈ ఏడాది ప్రజలందరికి అందరికి మంచి జరగాలని ప్రార్థించినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు.

09:14 AM (IST)  •  21 Jan 2022

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంట‌లు వ‌చ్చాయి. వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేష‌న్‌లో శుక్రవారం ఉద‌యం పొగలు రావడాన్ని గమనించారు. అప్రమ‌త్తమైన రైల్వే అధికారులు రైలును అదే స్టేషన్‌లో నిలిపివేశారు. సాంకేతిక లోపంతోనే ఈ ఘ‌ట‌న జరిగినట్లు భావిస్తున్నారు. కొంచెం సమయం తరువాత యథావిధిగా రైలు అక్కడి నుంచి బ‌య‌లుదేరింది. అయితే ఎస్6 బోగీలో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స్టేషన్‌లో రైలు ఆగిన వెంటనే బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget