అన్వేషించండి

ABP C Voter Opinion Poll : మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలు - ఏబీపీ సీఓటర్ సర్వేలో వెల్లడి !

Modi as PM : 56 శాతం మంది ఏపీ ప్రజలు మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏబీపీ సీఓటర్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది.

ABP C Voter Opinion Poll Andhra :  ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అసలు బలం లేదు. మూడు ప్రాంతీయ పార్టీలు హవా చూపిస్తున్నాయి. అదే్ సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత చరిత్ర ఉంది. అయితే ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రధానిగా ఎవరు కావాలని అడిగితే.. మోదీనే కావాలని కోరుతున్నారు. 56 శాతం మంది ఏపీ ప్రజల చాయిస్ ప్రధాని మోదీనే. ఈ విషయం ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 
 
ఏపీ ప్రజల్లో మోదీకే ఆదరణ 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటారనే ప్రశ్న సహజంగానే ఆసక్తి రేపుతంది. ఎందుకంటే ఎపీలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు మాస్ లీడర్లుగా ఉన్నారు. ఏ ఎలాంటి పదవికైనా  ఆయా పార్టీల సానుభూతిపరులు వారినే  కోరుకుంటారు. అయితే వారు ప్రధాని పదవి రేసులో ఉండరు కాబట్టి..  ప్రధాని మోదీ, రాహుల్ చాయిస్ గా ఏపీ ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ఏబీపీ - సీఓటర్ ఒపీనియన్ పోల్ జరిపింది. ఇందులో దేశం మొత్తం ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో  వారినే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తేలింది. 

56 శాతం మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొగ్గు మోదీ వైపు 

 తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ మంది ప్రధాని మోదీ పరిపాలనపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. మూడో సారి కూడా ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.   ఏపీ ప్రజల్లో 56 శాతం మంది ఆయన పాలనా తీరును సమర్థించి మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నారు.  దేశంలో అత్యంత కీలకమైన, ఖచ్చితమైన సర్వేలు అందిస్తుందని రికార్డు  సీఓటర్ సంస్థకు ఉంది.  దీ పేరును 56 శాతం మంది అంగీకరించారు. తెలంగాణలో  ఈ పర్సంటేజీ యాభై శాతం మాత్రమే ఉంది. అంటే.. . తెలంగాణ కంటే ఏపీలో మోదీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నట్లు అన్నమాట. 

రాహుల్‌ కు మద్దతు తక్కువే              

దక్షిణాదిలో మోదీకి మద్దతు లేదని కొంత మంది ప్రచారం చేస్తూ ఉంటారు.  అయితే ప్రధానిగా మోదీకే ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. ఏపీలో 56, తెలంగాణలో 50 శాతం మంది మోదీకి మద్దతు తెలుపుతూంటే..  రాహుల్‌కు మాత్రం ఏపీలో 34 శాతం.. తెలంగాణలో  40 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా లోక్ సభ ఎన్నికలు.. కేంద్రంలో  ఎవరు  పరిపాలన చేయాలన్న దానిపై మోదీకే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. 

ఏపీలో మోదీకి ఉన్న మద్దతు  బీజేపీకి ఎందుకు లభించడం లేదు ?                

ఏపీలో  మోదీకి అంత భారీగా మద్దతు ఉంటే బీజేపీ ఎందుకు ఏపీలో ఎదగలేకపోతోందని కొంత మందికి డౌట్ వస్తుంది.  మోదీని వ్యతిరేకించే పార్టీ ఏపీలో లేదు.  మూడు ప్రాంతీయ పార్టీలు మోదీ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి.  టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు   మోదీకి సపోర్టు చేస్తూ...  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఏపీలోని పాతిక లోక్ సభ సీట్లలో ఎవరు గెలిచినా ఎన్డీఏ ఖాతాలోనే ఉంటాయని సెటైర్లు పడుతూ ఉంటాయి. అయితే ప్రాంతీయ పార్టీల వ్యూహమే  బీజేపీని ఎదగకుండా చేస్తున్యని అనుకోవచ్చు.   

 

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget