అన్వేషించండి

Andhra Pradesh: ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు, ఈ ఏడాదిలో ప్రారంభం: మంత్రి విడదల రజిని

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు మంత్రి రజినీ వెల్లడించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి క్లాసులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. కొత్తగా ప్రారంభమయ్యే ఐదు వైద్య కళాశాలల నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలా ఏళ్ల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభం అయిందని, వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్రగా పేర్కొన్నారు మంత్రి విడదల రజిని.

'మెరుగైన వైద్యం అందించాలన్నదే లక్ష్యం'

ప్రజలు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైసీపీ సర్కారు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో వైఎస్సార్సీపీ సర్కారు భర్తీ చేసినన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి విడదల రజిని గుర్తు చేశారు.

Also Read: Indian Railway: తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లు, సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్

'బాబు పాలనలో దోచుకో, దాచుకో విధానం'

మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక్క ప్రభుత్వ కాలేజీ కుడా బాబు పాలనలో రాష్ట్రంలో రాలేదని విమర్శలు గుప్పించారు. గుంటూరులో మాట్లాడిన మంత్రి విడదల రజిని... ప్రతి పార్లమెంట్ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటుకు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. 

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే జగన్ లక్ష్యం'

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లతో పాటు రాష్ట్రంలో 462 పీజీ సీట్లు కూడా పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో వైసీపీ సర్కారు భర్తీ చేసినన్ని ఖాళీలు ఏ ప్రభుత్వమూ చేయలేదని ఉద్ఘాటించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఒక్క వైద్య కాలేజీ కూడా రాలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ దవాఖానాల్లో సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగాయని గుర్తు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget