అన్వేషించండి

AP Corona Updates: ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు, తెలంగాణలో 208 కేసులు ... అక్టోబర్ నుంచి వ్యాక్సిన్లు విదేశాలకు ఎగుమతి చేస్తామంటున్న కేంద్రం

ఏపీలో గడిచిన 24 గంటల్లో 839 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాక్సిన్లు ఎగుమతులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 42,679 పరీక్షలు నిర్వహించగా 839 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా కోవిడ్ బులిటెన్ సోమవారం విడుదల చేసింది. ఇవాళ్టి కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,39,529 మంది కరోనా బారినపడినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బులిటెన్ లో ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,078కు చేరింది. 24 గంటల వ్యవధిలో 1,142 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 20,11,063కి చేరిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. 

Also Read: Vijayawada News: డ్రగ్స్ ముఠాతో విజయవాడకు సంబంధంలేదన్న సీపీ శ్రీనివాసులు... గుజరాత్ ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత...

ప్రస్తుతం ఏపీలో 14,388 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,77,63,761 నమూనాలను పరీక్షించారు. కోవిడ్‌తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 231, నెల్లూరు జిల్లాలో 149 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 101 కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అక్టోబర్ నుంచి వ్యాక్సిన్ల ఎగుమతి

కరోనా వ్యాక్సిన్లను అక్టోబర్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతి, విరాళంగా ఇవ్వడం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. భారతీయులకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమని ఆయన తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను మైత్రి కార్యక్రమం ద్వారా సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. సోమవారం ఈ ప్రకటన వెలువడింది. 

కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్‌ నెలలో 30 కోట్లు, వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 100 కోట్ల డోసులు అందుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 11 రోజుల్లో 10 కోట్ల డోసులు పంపిణీ చేశామని తెలిపారు. దేశ ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్టోబర్‌-డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ మైత్రి, కోవాక్స్‌కు ఎగుమతులు, విరాళాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి మాండవీయ ప్రకటించారు. 

Also Read: TollyWood Meet : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget