అన్వేషించండి

Inter Online Admissions: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...

ఏపీ ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు బ్రేక్ పడింది. ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు పాత విధానాన్నే అమలు చేయాలని తెలిపింది.

ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు బ్రేక్ పడింది. ఇంటర్‌ విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల కోసం ఆగస్టు 10న ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దుచేసింది. ఈ ఏడాది ప్రవేశాలకు పాత విధానాన్నే అమలుచేయాలని తెలిపింది. భవిష్యత్తులో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు సోమవారం ఈ తీర్పు ఇచ్చారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇంటర్‌ విద్యా మండలికి బదలాయించడం చట్టప్రకారం చెల్లదని కోర్టు తెలిపింది. కరోనా కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల భద్రత నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యా మండలి ఈ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని స్పష్టం చేసింది. 

చట్టబద్ధత లేదు

ఆన్లైన్ ప్రవేశాలపై  ఇంటర్‌ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదని కోర్టు తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులు చేశామని, ఇప్పుడు ప్రతిభ ఆధారంగా ఇంటర్‌ ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పడంలో అర్థం లేదని తెలిపింది. ఇప్పటికే లక్షల మంది ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నారన్న కారణంతో నిబంధనలకు అనుగుణంగా లేని నోటిఫికేషన్ ను సమర్థించలేమని తెలిపింది. ఆన్‌లైన్‌ ప్రవేశాలపై సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, కొందరు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు. 

కోవిడ్ ఒక సాకు 

పిటిషన్లలలో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు సరైన విధివిధానాలు రూపొందించలేదని పేర్కొన్నారు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానాన్ని వెల్లడించిందన్నారు. గతేడాది ఇలాగే చేస్తే హైకోర్టు తప్పుపట్టిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విద్యార్థులు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు చెబుతోందని, అలాంటప్పుడు ఇంటర్‌ రెండో సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడం కోసం కోవిడ్‌ను ఓ సాకుగా చెబుతున్నారన్నారు. విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకునే హక్కును ఆన్ లైన్ ప్రవేశాల ద్వారా హరిస్తున్నారని పిటిషనర్లు తెలిపారు. ఈ పిటిషన్లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు సోమవారం తుదితీర్పు ఇచ్చింది. ఇంటర్మీడియట్‌ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆన్‌లైన్‌ విధానాన్ని ఇంటర్ బోర్డు తీసుకువచ్చిందన్నారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరిగి ఇబ్బందిపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. 

 

Also Read: CM Jagan Review: పోర్టులు, ఎయిర్‌పోర్టులు నిర్దేశిత సమయంలోపు పూర్తి కావాలి.. సమీక్షలో సీఎం జగన్ ఆదేశం

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Seediri Appalaraju Arrest: మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget