అన్వేషించండి

AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh News | అన్నమయ్య జిల్లాలో గుండాల కోనలో ఏనుగుల దాడి ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తుల భద్రత పెంచాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

Elephants attack in Annamayya District | ఓబులవారిపాలెం: అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం గుండాల కోనలో ఏనుగుల దాడి ఘటనతో  కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరగనున్న ఉత్సవాల నేపథ్యంలో అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతాల్లోని  శివాలయాల వద్ద తక్షణమే భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే  భక్తులకి సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం  పోలీస్ శాఖ, అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని హోం మంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించారు. శివరాత్రి సందర్భంగా వై.కోటకు చెందిన భక్తులు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా గుండాల కోన వద్ద వారిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. 14 మందిలో ముగ్గురు భక్తులు దినేష్, చంగల్ రాయుడు, తుపాకుల మణమ్మ చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. 

ఏనుగుల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి రూ.10 చొప్పున, గాయపడిన బాధితులకు రూ.5 లక్షల మేర సాయం ప్రకటించారు.

మన్యం జిల్లాలోనూ ఏనుగుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున సాయి గాయత్రి రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి రైస్ మిల్లులోనికి ఏనుగుల గుంపు చొరబడింది. మిల్లులో నిల్వ చేసిన ధాన్యం, బియ్యం నిల్వలను ఏనుగుల గుంపు చెల్లాచెదురు చేసింది. నెల రోజుల్లో ఈ రైస్ మిల్లుపై దాడి జరగడం ఇది రెండోసారి. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి తమకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని.. తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. 

Also Read: Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget