అన్వేషించండి

AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh News | అన్నమయ్య జిల్లాలో గుండాల కోనలో ఏనుగుల దాడి ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తుల భద్రత పెంచాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

Elephants attack in Annamayya District | ఓబులవారిపాలెం: అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం గుండాల కోనలో ఏనుగుల దాడి ఘటనతో  కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరగనున్న ఉత్సవాల నేపథ్యంలో అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతాల్లోని  శివాలయాల వద్ద తక్షణమే భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే  భక్తులకి సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం  పోలీస్ శాఖ, అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని హోం మంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించారు. శివరాత్రి సందర్భంగా వై.కోటకు చెందిన భక్తులు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా గుండాల కోన వద్ద వారిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. 14 మందిలో ముగ్గురు భక్తులు దినేష్, చంగల్ రాయుడు, తుపాకుల మణమ్మ చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. 

ఏనుగుల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి రూ.10 చొప్పున, గాయపడిన బాధితులకు రూ.5 లక్షల మేర సాయం ప్రకటించారు.

మన్యం జిల్లాలోనూ ఏనుగుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున సాయి గాయత్రి రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి రైస్ మిల్లులోనికి ఏనుగుల గుంపు చొరబడింది. మిల్లులో నిల్వ చేసిన ధాన్యం, బియ్యం నిల్వలను ఏనుగుల గుంపు చెల్లాచెదురు చేసింది. నెల రోజుల్లో ఈ రైస్ మిల్లుపై దాడి జరగడం ఇది రెండోసారి. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి తమకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని.. తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. 

Also Read: Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget