అన్వేషించండి

‘ముందస్తు’గానే చెప్పేశారు- ప్రత్యర్థుల ప్రచారానికి చెక్‌పెట్టిన జగన్

గతకొన్నిరోజులుగా ఏపీలో విపక్షాలు ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న విధంగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి. అయితే వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండేది కొన్నిరోజులే అని తెగ భాజా మోగించింది.

గతకొన్నిరోజులుగా ఏపీలో విపక్షాలు ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న విధంగా మాట్లాడారు. రేపో మాపో సిఎం జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండేది కొన్నిరోజులే అని తెగ ప్రచారం చేసింది. అతి త్వరలోనే జగన్ని సీబీఐ జైల్లో పెడుతుందని కూడా జోస్యం చెప్పింది. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లే కాదు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. త్వరలోనే ముందస్తు ఉంటాయన్న విధంగా మాట్లాడారు.

విపక్షాల వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ ఏపీ సిఎం జగన్ ముందస్తుపై క్లారిటీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఆ ప్రాజెక్టు ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని కూడా మాట్లాడారు. అంటే ముందస్తు ఎన్నికలు లేవని చెప్పకనే చెప్పేశారంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

151 సీట్లతో గత ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని అందుకున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే జగన్‌ ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతీ వైసీపీ నేత, అధికారి ప్రతీ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. జగన్‌ పాలనా తీరుపైనా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మేనిఫోస్టోలోని పథకాలే కాకుండా జగన్‌ ప్రభుత్వం కొత్త వాటిని కూడా అమలు చేయడంతో రానున్న ఎన్నికల్లో విపక్షం లేకుండా చేయగలమన్న ధీమాతో ముందుకు పోతోంది.

వైసీపీని ఎదుర్కోవడానికి టిడిపి పక్కా వ్యూహాన్ని రచిస్తోంది. గతంలో వైసీపీ వెళ్లిన దారిలోనే వెళ్లాలని భావిస్తోంది. బీజేపీతో చేతులు కలపాలని ప్రయత్నాలు మొదలెట్టింది. అదే టైంలో ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతూ బాదుడే బాదుడు అంటూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. చంద్రబాబు సభలకు భారీగాా జనసమీకరణ చేస్తుంది. 

జనసేన కూడా ఊపు మీద కనిపిస్తోంది. ఎలాగైనా సరే జగన్ని గెలవనీయకూడదన్న లక్ష్యంతో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పవన్ ప్రకటించారు. జగన్‌ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీలో రేపోమాపో ఎన్నికలన్నట్లు వాతావరణం హాట్‌ హాట్‌ గా నడిచింది. అంతేకాదు జగన్ పథకాలు, నిర్ణయాలన్నింటికి వివిధ మార్గాల్లో చెక్‌ పెడుతూ ప్రధాన ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించడమే కాదు వచ్చే ఎన్నికల్లో ఈ విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్‌ లో ఉంది. 

బాబు వ్యూహం బాబుది. 
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికలెప్పుడైనా వస్తాయని, అందుకు తమ్మళ్లు అంతా సిద్దంగా ఉండాలని మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. నియోజకవర్గాల్లో బాగా పని చేసేవారికే టిక్కెట్లు అంటూ సంకేతాలు ఇచ్చారు. బాబు మాత్రం 175 సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులను రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొందరు నేతలకు మీకు ఫలానా నియోజకవర్గం టిక్కెట్ గ్యారెంటీ ఇచ్చారంట. ముందు మీరు వెళ్లి మీ మీ నియోజకవర్గాల్లో పని చేసుకోండి, వీలైంత ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టి దాన్ని ఓటు బ్యాంకుగా మరల్చుకోవాలని చంద్రబాబు సూచించారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఇంటిని చక్క పెడుతున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కూడా వచ్చే ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇంటిని చక్కదిద్దే పనిలో పడ్డారాయన. పార్టీలో కోవర్టులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండీ, లేకపోతే పోండంటూ చెప్పేశారు. పార్టీలో టిక్కెట్ ఆశావాహులకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తున్నారంట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జన సైనికులంతా సిద్దంగా ఉండాలని ఇంటర్నల్ మీటింగ్స్ ఆ పార్టీ థింక్ ట్యాంక్ సంకేతాలుపంపిస్తున్నది. 

ఇలా ఏపీలో అధికార, విపక్షాలన్నీ ఎవరి వ్యూహాల్లో వాళ్లు ముందుకెళ్తూ ప్రతీ క్షణం పొలిటికల్‌ వార్‌ టెన్షన్‌ టెన్షన్‌ గా ఉంటోంది.

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget