అన్వేషించండి

AP Assembly Session-2024: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు-సభ ముందుకు రెండు బిల్లులు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు-2024ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి(గురువారం)తో ముగియనున్నాయి. చివరి రోజు..  వివిధ శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించిన తర్వాత... ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమాధానం ఇస్తారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే మరో రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు సభాపతి తమ్మినేని సీతారాం.

ఈనెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. రెండో రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాలు తెలిపింది సభ. ఇక.. మూడో రోజు (ఫిబ్రవరి 7న) ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. మరోవైపు... అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు గందరగోళం నెలకొంది. పది మంది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. పోడియంపైకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... కాగితాలు చించి విసిరేశారు. దీంతో సభలో గందరగోళం కొనసాగింది. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే మూడు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. పది మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు సభలో నుంచి బయటకు వెళ్లకపోవడంతో... మార్షల్స్‌ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. శాసనమండలిలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఇక.. ఇవాళ (గురువారం) సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024ను సభ ముందుకు తీసుకురానుంది. 

ఇక, శాసనమండలిలోనూ ఇవాళ (గురువారం) పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై మండలిలో చర్చిస్తారు. చర్చ తర్వాత మండలిలో కూడా సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. మరోవైపు.. మండలిలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. నిన్న అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను ఇవాళ శాసనమండలిలో పెట్టనుంది వైఎస్‌ఆర్‌సీపీ సర్కార్‌. మొత్తంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు అసెంబ్లీ ఇవాళ్టితో ముగుస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; నాకు కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; నాకు కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Spirit Movie : వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - ప్రభాస్ 'స్పిరిట్' పోస్టర్‌తోనే ఓవర్ నైట్ స్టార్
వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - ప్రభాస్ 'స్పిరిట్' పోస్టర్‌తోనే ఓవర్ నైట్ స్టార్
Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!
వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!
Telangana Maoist Leaders : రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మాజీ మావోయిస్టుల ఆలోచన! సీఎం రేవంత్‌తో కీలక చర్చలు !
రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మాజీ మావోయిస్టుల ఆలోచన! సీఎం రేవంత్‌తో కీలక చర్చలు !
Dhurandhar 2 First Review : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
Embed widget