అన్వేషించండి

Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో ఇద్దరు ఏపీ వాసులు మృతి, ఇంకా లభ్యం కానీ 34 మంది ఆచూకీ!

Amarnath Yatra : ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో 38 మంది సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. మరో 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

Amarnath Yatra : ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. మరో 18 మంది యాత్రికులు సోమవారం రైలులో చండీగఢ్‌ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ అకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన యాత్రికుల్లో ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖకు సమాచారం అందింది. నెల్లూరు నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితో పాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు మహిళల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

లభ్యం కానీ 34 మంది ఆచూకీ 

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు వరదల తర్వాత అందకపోవడంతో రెవెన్యూ అధికారులు వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని చెప్పగా మరికొందరు విపత్తుకు ముందే తమ వారు వెళ్లిపోయారని తెలిపారు. అయితే ఇంకొందరు మాత్రం తమవారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ వస్తున్నాయని ఆచూకీ దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 34 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులకు నిర్ధరణకు వచ్చారు.

ఇద్దరు మృతి 

అయితే అమర్నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం అయింది. బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన 12వ బ్యాచ్ పహల్ఘడ్ నుంచి బయలుదేరారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ కుటుంబసభ్యులు శ్రీనగర్ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె భర్త, అల్లుడు అక్కడే ఉన్నారని, వీలైనంత త్వరగా ఆమె మృత దేహాన్ని రాష్ట్రానికి తీసుకొస్తామని అధికారులు తెలియజేశారు. రాజమహేంద్రవరానికే చెందిన పార్వతి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. ఆమెను వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. 

యాత్రికుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 

నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ వెల్లడించారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా మరో 25 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో చాలా మంది గల్లంతయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget