అన్వేషించండి

Lakshmi Parvathi: చంద్రబాబు - అమిత్ షా భేటీ వెనక కీలక వ్యక్తి ఆయనే: లక్ష్మీ పార్వతి

చంద్రబాబు నాయుడుపై తాను పుస్తకం రాశానని.. దానికి ‘అల్లుడు సుద్దులు’ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్రవాసీలుగా మిగిలిపోతారని తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఇప్పటికే వాళ్ళు తెలంగాణకు నుంచి వచ్చి వెళుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు సమాధి కట్టేయడం ఖాయం అని వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ చదువు సంధ్యలు లేని మూర్ఖుడంటూ వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారం లోకేష్ కు ఉందని అన్నారు. ఈవెనింగ్ వాక్ చేస్తే అది పాదయాత్ర అవుతుందా అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడుపై.. తాను పుస్తకం రాశానని.. ‘దానికి అల్లుడు సుద్దులు’ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. మహిళలు, రైతులను మోసం చేయడమే చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు గతంలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి అన్నారు.

చంద్రబాబు - అమిత్ షా భేటీ వెనుక ఆయనే

కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు తొలి ప్రయత్నం విఫలమైందని అన్నారు. పొత్తుల కోసం బీజేపీ పెద్దలను ఆశ్రయించాలనే చంద్రబాబు ఆలోచనలకు బ్రేకులు పడ్డాయని, కాలం మళ్లీ వెనక్కి తిరిగిందని అన్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మదని.. వెంకయ్య నాయుడు చెప్పారనే చంద్రబాబుతో మీటింగ్‌కు అమిత్ షా ఒప్పుకున్నారని తెలిపారు. మరోసారి షా, బాబు భేటీ జరిగితే అప్పుడు ఏదో జరుగుతుందని భావించొచ్చని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అక్రమ నిర్మాణంలో ఉండడం సిగ్గులేనితనం అంటూ లక్ష్మీపార్వతి అన్నారు.

కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును ముంచేసిన ఘనుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి కోసం పోలవరంలో ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎటువంటి ఉపాయాలైనా వేస్తారన్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప శాశ్వత శత్రుత్వాలు పార్టీల మధ్య ఉండవని అన్నారు.

చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని విమర్శించారు. టీడీపీతో కలయిక రాజకీయ నాయడుగా పవన్ కళ్యాణ్ కు తీవ్ర నష్టం కలిగిందని విశ్లేషించారు. ఓట్లు చీల్చడం అంత ఈజీ కాదన్న లక్ష్మీ పార్వతి..నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget