అన్వేషించండి

Vijayawada: విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ పనులు ఎంత వరకు వచ్చాయి?  

Vijayawada-Guntur Railway Line Works: అమరావతి అభివృద్ధిలో కీలకంగా, గుంటూరు, విజయవాడ మధ్య కనెక్టివి మరింత పెంచే పనులు ఊపందుకున్నాయి. మూడో రైల్వే పనుల డీపీఆర్‌ ఢిల్లీకి చేరుకుంది.

Vijayawada-Guntur Railway Line Works: విజయవాడ-గుంటూరు రైల్వే మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు చాలా వేగంగా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పనులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ సర్వే పూర్తైంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కూడా అధికారులు దక్షిణ మధ్య రైల్వేకు అందజేశారు. అక్కడ కూడా క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫైల్ రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు.

సుమారు రూ.1,200 కోట్లు అంచనాతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం రెండు లైన్లు మాత్రమే వర్కింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ రూట్‌లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. భారీ సంఖ్య రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైళ్ల సమయాలపై ప్రభావం చూపుతోంది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్‌లో జాప్యం జరుగుతోంది.  

మూడో లైన్ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు?

విజయవాడ-గుంటూరు మధ్య నెలకొన్న రద్దీ సమస్య నివారణకు మూడో రైల్వే లైన్ నిర్మాణం అవసరం. ఈ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నా కార్యరూపం దాల్చలేదు. మూడోలైన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో కార్యకలాపాలు కూడా ఊపందుకుంటే ఈ రద్ది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూడో లైన్ పూర్తి అయితే రవాణాపై భారం పడకుండా ఉంటుంది. వివిధ మార్గాల్లో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.  

Image

విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ఈ మధ్యనే అధికారులు పూర్తి చేశారు. డీపీఆర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పంపించారు. అక్కడ కూడా అధికారులు అప్రూవల్ చేసి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు. భూసేకరణ, రైల్వే ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధి వంటి చాలా ఆంశాలను ఈ డీపీఆర్‌లో చేర్చారు.  

Image

ఈ మూడో రైల్వేలైన్ వల్ల యూజ్ ఏంటీ 
వేగవంతమైన ప్రయాణం: మూడో లైన్ ఏర్పాటు వల్ల రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. రద్దీ తగ్గడం వల్ల రైళ్ల షెడ్యూల్‌లో జాప్యం లేకుండా ఉంటుంది. ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

రైళ్ల సంఖ్య పెరుగుదల: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.

ఆర్థిక వృద్ధి: విజయవాడ, గుంటూరు జంట నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల వాణిజ్యం, పరిశ్రమలు, సేవల రంగంలో వృద్ధి సాధ్యమవుతుంది. 
చవకైన రవాణా: రైల్వే ప్రజా రవాణాలో అత్యంత చవకైన, సమర్థవంతమైన మార్గం. మూడో లైన్ ఏర్పాటు వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి.

గూడ్స్ రవాణా సామర్థ్యం: గూడ్స్ రైళ్లకు ప్రత్యేక లైన్ కేటాయించడం వల్ల వాణిజ్య రవాణా సామర్థ్యం పెరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది.

అమరావతికి ఊతం: అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో రవాణా అవసరాలు కూడా పెరుగుతున్నాయి.  మూడో రైల్వే లైన్ ఏర్పాటు ఈ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget