అన్వేషించండి

Vijayawada: విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ పనులు ఎంత వరకు వచ్చాయి?  

Vijayawada-Guntur Railway Line Works: అమరావతి అభివృద్ధిలో కీలకంగా, గుంటూరు, విజయవాడ మధ్య కనెక్టివి మరింత పెంచే పనులు ఊపందుకున్నాయి. మూడో రైల్వే పనుల డీపీఆర్‌ ఢిల్లీకి చేరుకుంది.

Vijayawada-Guntur Railway Line Works: విజయవాడ-గుంటూరు రైల్వే మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు చాలా వేగంగా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పనులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ సర్వే పూర్తైంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కూడా అధికారులు దక్షిణ మధ్య రైల్వేకు అందజేశారు. అక్కడ కూడా క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫైల్ రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు.

సుమారు రూ.1,200 కోట్లు అంచనాతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం రెండు లైన్లు మాత్రమే వర్కింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ రూట్‌లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. భారీ సంఖ్య రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైళ్ల సమయాలపై ప్రభావం చూపుతోంది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్‌లో జాప్యం జరుగుతోంది.  

మూడో లైన్ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు?

విజయవాడ-గుంటూరు మధ్య నెలకొన్న రద్దీ సమస్య నివారణకు మూడో రైల్వే లైన్ నిర్మాణం అవసరం. ఈ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నా కార్యరూపం దాల్చలేదు. మూడోలైన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో కార్యకలాపాలు కూడా ఊపందుకుంటే ఈ రద్ది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూడో లైన్ పూర్తి అయితే రవాణాపై భారం పడకుండా ఉంటుంది. వివిధ మార్గాల్లో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.  

Image

విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ఈ మధ్యనే అధికారులు పూర్తి చేశారు. డీపీఆర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పంపించారు. అక్కడ కూడా అధికారులు అప్రూవల్ చేసి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు. భూసేకరణ, రైల్వే ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధి వంటి చాలా ఆంశాలను ఈ డీపీఆర్‌లో చేర్చారు.  

Image

ఈ మూడో రైల్వేలైన్ వల్ల యూజ్ ఏంటీ 
వేగవంతమైన ప్రయాణం: మూడో లైన్ ఏర్పాటు వల్ల రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. రద్దీ తగ్గడం వల్ల రైళ్ల షెడ్యూల్‌లో జాప్యం లేకుండా ఉంటుంది. ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

రైళ్ల సంఖ్య పెరుగుదల: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.

ఆర్థిక వృద్ధి: విజయవాడ, గుంటూరు జంట నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల వాణిజ్యం, పరిశ్రమలు, సేవల రంగంలో వృద్ధి సాధ్యమవుతుంది. 
చవకైన రవాణా: రైల్వే ప్రజా రవాణాలో అత్యంత చవకైన, సమర్థవంతమైన మార్గం. మూడో లైన్ ఏర్పాటు వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి.

గూడ్స్ రవాణా సామర్థ్యం: గూడ్స్ రైళ్లకు ప్రత్యేక లైన్ కేటాయించడం వల్ల వాణిజ్య రవాణా సామర్థ్యం పెరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది.

అమరావతికి ఊతం: అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో రవాణా అవసరాలు కూడా పెరుగుతున్నాయి.  మూడో రైల్వే లైన్ ఏర్పాటు ఈ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Embed widget