అన్వేషించండి

YSRCP : వాలంటీర్లతోనే విజయం - బాపట్ల జిల్లాలో పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం

వాలంటీర్ల సేవలను వైసీపీ నేతలు పార్టీకి వినియోగించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. గెలుపులో వారి పాత్ర కీలకమన్నారు.

 

YSRCP :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహరాల పై నేతలు ఫోకస్ పెట్టారు. అదే సమయంలో గెలుపు గుర్రాల ఎంపిక విషయంలో  పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్దితులను అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పర్యటనలు కూడా ప్రారంభించారు.  బాపట్ల జిల్లాలో పరిస్దితులు,  నియోజకవర్గాల ఇంచార్జ్ లు, స్దానికంగా ఉన్న శాసన సభ్యులు వారి పని తీరు పై  విజయ సాయి రెడ్డి ప్రత్యేకంగా వాకబు చేశారు. రెండు రోజుల పాటు బాపట్ల జిల్లా  పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.  ఆమంచి తీరు పై నాయకులు విజయ సాయి రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇతర నియోజకవర్గల్లో జోక్యం వద్దని ఇప్పటికే ఆమంచి కి చెప్పామని    నాయకులకు విజయ సాయి సర్ది చెప్పారు.

51 శాతం ఓట్లు వస్తాయన్న  విజయసాయిరెడ్డి 

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిందని, ఫలితంగా రాష్ట్రంలో 51% పైచిలుకు ప్రజలు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.  2024 ఎన్నికల్లో 151 సీట్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దక్షిణ కోస్తా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి చెబుతున్నారు.   బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, పర్చూరు, రేపల్లె, అద్దంకి,చీరాల,వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పార్టీ అత్యంత ప్రజాధరణతో పూర్తి బలంగా ఉందని విజయ సాయి అన్నారు. 

బాపట్లలో అన్ని  స్థానాలను గెల్చుకుంటామని ధీమా 

బాపట్ల జిల్లా క్లిష్టమైన జిల్లా అని, గతంలో అద్దంకి, చీరాల, పర్చూరు, రేపల్లె పోగోట్టుకున్నామని అయితే ఇప్పుడు వేమూరు, బాపట్లతో పాటు గతంలో పోగొట్టుకున్న 4 నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని అన్నారు. జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించిన తరువాత ఈ నమ్మకం మరింత బలపడిందని అన్నారు. ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా మొదటి విడతలో అన్ని జిల్లాల్లో పర్యటనలు, రెండవ విడతలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.  జగనన్న సురక్ష కింద ప్రజల సమస్యలను పరిష్కరించామని అన్నారు. మూడవ విడతలో ప్రతి మండలంలోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు లక్ష్యంతో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని అన్నారు.
 
వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచనలు

నియోజకవర్గంలో అత్యంత కీలకంగా వాలంటీర్ల ను పార్టీ తరపున ఉపయోగించాలని విజయ సాయి రెడ్డి, పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు. మరలా అధికారం రావాలంటే వాలంటీర్ల ద్వారేనే కీలకంగా పనులు చేయించటం ద్వారా, ప్రతి ఇంటిని ఓటర్ ను టచ్ లోకి తీసుకోవటం సాధ్యం అవుతుందని, ఈ విషయంలో  ర్టి నాయకులు విభేదాలు, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టిన వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కార్యకలాపాలు సాగించాలని ఆయన సూచించారు. పార్టీ కి వ్యతిరేకంగా, ఇంచార్జ్ , శాసన సభ్యుడిని కాదని  నాయకులు, మందుకు వెళ్ళరాదని ఆయన స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Car Blast Case Update : ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
AP CM Chandrababu: 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు-  సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు- సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Bank Loan on Silver Jewelry:  వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Car Blast Case Update : ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
AP CM Chandrababu: 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు-  సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు- సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Bank Loan on Silver Jewelry:  వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
Delhi Blast CCTV Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Viral Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Airtel : ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్! చౌకైన ప్లాన్‌ రద్దు!
ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్! చౌకైన ప్లాన్‌ రద్దు!
Khanapur MLA Vedma Bojju: అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Embed widget