అన్వేషించండి

Undavalli Arun: పవన్ వారాహి యాత్ర సక్సెస్ కానీ, స్పీచ్ లతో పవన్ కన్ఫ్యూజన్ సృష్టించారు- ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar: చిట్ ఫండ్ నిబంధనలు మార్గదర్శి పాటించదని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Undavalli Arun Kumar: మార్గదర్శి వ్యవహారంలో తాను పదిహేను సంవత్సరాల కిందట చెప్పినవన్నీ నిజాలేనని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి ఆరుణ్ కుమార్ అన్నారు. ఈ విషయాలను  మార్గదర్శి యాజమాన్యం కూడా ఒప్పుకుందని చెప్పారు.

మార్గదర్శిపై ఉండవల్లి కామెంట్స్....
చిట్ ఫండ్ నిబంధనలు మార్గదర్శి పాటించదని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నవన్నీ కూడా వాస్తవాలేనని అయితే వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోవటానికి కారణాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుండి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెద్దలతో రామోజీకి పరిచయాలు ఉన్న కారణంగా నిబందనలకు విరుద్దంగా మార్గదర్శి నడుస్తుందని చెప్పారు. అంతే కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మినహా మిగిలిన పార్టిలు, అన్ని మార్గదర్శికి అనుకూలమేనని అన్నారు. మార్గదర్శి  విషయంలో తాను చెప్పినవన్నీ నేడు నిజం అయ్యాయని అన్నారు.

రాజ్యాంగంలోనే ఉమ్మడి పౌరస్మృతి... 
ఆర్ధిక  అసమానతలు పోగొట్టడంపై  కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి  పౌరస్మృతి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా, తెలగు దేశం పార్టీ, జనసేన పార్టీలు శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీతో కలసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా ఆ పార్టీకి మద్దతు  ఇచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే  జనసేన సైతం శ్వేతపత్రం  ఇవ్వాలని కోరారు.  

అది మామూలు విషయం కాదు...
యూనిఫామ్ సివిల్ కోడ్ మాములు విషయం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చాలా కులాల్లో విడాకులు కుల పెద్దలు ఇచ్చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కులాలకే  ఒకే  కోడ్  తేలేమని ఆయన అన్నారు. అలాంటప్పుడు యూనిఫామ్  సివిల్  కోడ్ సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి  పౌరస్మృతి  భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఉంది కాని ఆ పార్టీ ప్రారంభించింది కాదని చెప్పారు. రాజ్యాంగంలోనే ఉమ్మడి  పౌరస్మృతి  గురించి ఉందని, ఆర్ధిక  అసమానతలు తొలగిపోయే విధంగా  వెళ్లాలని రాజ్యాంగంలో ఉందని చెప్పారు. ఎవరు ఏ  పని చేసినా సరైన  వేతనం, చదువుకునే  పరిస్థితి ఉండేలా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని రాజ్యాంగంలో ఉందని వివరించారు.  
ఐపీసీ అన్ని మతాలకు  ఒక్కటేనని, ఎక్కడ  పేదరికం  ఉందో  అక్కడ  జనాభా ఎక్కువ ఉందన్నారు. ముస్లిం  జనాభా ఎక్కువని అనవసర ప్రచారం  జరుగుతోందన్నారు. లా  కమిషన్  ఒక రిపోర్ట్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను ముట్టుకోవద్దు అని లా కమిషన్ చెప్పిందని తెలిపారు. ఈ  ఏడాది  22వ లా కమిషన్  మళ్ళీ  రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు.

కేంద్రమే కారణం...
పోలవరం డయా ఫ్రామ్ వాల్ డ్యామేజ్  లో బాద్యులను  ప్రభుత్వం  గుర్తించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రాన్ని  విమర్శించే  పరిస్థితి  ఏ పార్టీకి   లేదని అభిప్రాయపడ్డారు. మనకున్న అష్ట దరిద్రాలకు  కారణం  కేంద్రమే అని మండిపడ్డారు. రాష్ట్ర  విభజన విషయం షో రూమ్  పంచుకోవడం  లాంటిదేనని, షో  రూమ్ తెలంగాణకు, వెనక  గోడౌన్ మనకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంత  పకడ్బందీగా ఉన్న  వ్యవస్థలో ఇన్ని లోపాలు  ఎందుకు  వస్తున్నాయని ప్రశ్నించారు.

వారాహి యాత్ర విజయవంతం... కానీ!
జనసేన అధినేత పవన్ పై  ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు  తర్వాత తాను పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పారు. పవన్ వారాహి యాత్ర విజయవంతమైందని, మిగిలిన హీరోలకంటే పవన్ కు కొంచెం అభిమానులు ఎక్కువే కాబట్టి యాత్రకు తరలివచ్చారని అన్నారు. 
పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదని, కానీ వారాహి యాత్రలో తన స్పీచ్ లతో కన్ఫ్యూజన్ సృష్టించారని వ్యాఖ్యానించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget