అన్వేషించండి

Nijam Gelichindi Prajaswamyam Nilichinidi: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది- టీడీపీ భావోద్వేగ నినాదం వైరల్‌- ప్రజలకు భువనేశ్వరి ప్రణామం

Chandra Babu: నిజం గెలవాలి అనే పదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవం సృష్టించింది. అంకుశంలా మారి వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చేసింది. అందుకే మరోసారి ఇవాళ్టి సభలో నేతలంతా అదే నినాదాన్ని అందుకున్నారు.

Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ ేతలు నిజం గెలిచింది... ప్రజాస్వామ్యం నిలిచిందని నినాదాలు అందుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును అప్పటి  అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా దూషించిది. అనేకరకాలుగా అవమానలు పాల్జేసింది. కేసులు పెట్టి జైల్లో కూడా వేసింది. 

అందుకే వాటిని గుర్తు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలించిందని ఎలుగెత్తుతున్నారు. టీడీపీ సభ్యులంతా సభలోకి ఈ నినాదంతో ప్లకార్డులు పట్టుకొని వచ్చి నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచిందని నినాదాలతోపాటు గౌరవ సభకు స్వాగతమంటూ చంద్రబాబును చిరునవ్వులతో ఆహ్వానించారు. 
నారా భువనేశ్వరి కూడా తన ట్విట్టర్‌లో నిజం గెలిచిందనే నినాతో పోస్టు పెట్టారు. కౌరవ  సభ నుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నేడు గౌరవ సభకు వచ్చారని భువనేశ్వరి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

2021 నవంబరు 19న తన నిండు సభలో చంద్రబాబును వైసీపీ సభ్యులు ఘోరంగా అవమానించారు. అప్పటి వరకు అన్నింటినీ తట్టుకున్న చంద్రబాబు తన ఫ్యామిలీపై నిందలు వేయడంతో సభకు నమస్కారం పెట్టి ఇది గౌరవ సభ కాదని కౌరవ సభమాదిరి తయారైందని ఆవేనద వ్యక్తం చేశారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతాని శపథం చేసి సభ నుంచి వచ్చేశారు. మీడియా సమావేశం పెట్టి తనకు ఇంతంటి అవమానం జరిగిందని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

తర్వాత కొన్ని రోజులకు చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి జైల్లో వేశారు. అప్పటి వరకు రాజకీయ వేదికలపై కనిపించని భువనేశ్వరి తొలిసారిగా నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక చనిపోయిన వారి ఫ్యామిలీలను పరామర్శించారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజల కోసమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. 

కచ్చితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు మేలు చేస్తారని భువనేశ్వరి నమ్మారు. ఆదే విషయాన్ని పరామర్శలో ప్రజలకు చెప్పారు. అన్నట్టుగానే చంద్రబాబు అఖండమైన మెజార్టీతో విజయం సాధించారు. తనను ఘోరంగా అవమానించిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 

అప్పట్లో చంద్రబాబును సూటిపోటి మాటలతో అవమానించిన నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. బూతులు తిట్టే నేతలు ఇంటిబాటపట్టారు. వారందర్నీ ప్రజలు ఓటుతో ఓడించారు. వాటన్నింటినీ గుర్తు చేసుకున్న టీడీపీ సభ్యులు, భువనేశ్వరి నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచిందని గట్టిగా భావోద్వేగంతో నినదిస్తున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget