అన్వేషించండి

Chandrababu Cabinet: చంద్రబాబు టీంలో ఉండేది ఎవరు? మిత్రపక్షాలకు ఇచ్చే మంత్రిపదవులు ఎన్ని?

Andhra Pradesh: ఏపీ సీఎంగా 12న ప్రమాణం చేయనున్న చంద్రబాబు జట్టులో ఉండేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే దీనిపై ఆయన కసర్తుత పూర్తి చేశారని టాక్. మరి అందులో ఉండేది ఎవరు? పవన్‌కు దక్కే పదవేంటీ?

Andhra Pradesh Cabinet: కేంద్ర మంత్రివర్గంలోఎవరెవరు ఉంటారనే ఉత్కంఠకు ఇప్పటికే తెరపడింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి ఉంటుంది... జనసేనకు ఎన్ని పదవులు ఇస్తారు... బీజేపీ ఎన్ని తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని మిత్రపక్షాలతో కూడా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈసారి 164 మంది గెలవడంతో పోటీ మామూలుగా లేదు. అందులో మహిళలు, సీనియర్లు, యువత ఇలా ఎటు చూసినా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న వాళ్లే కనిపిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని చంద్రబాబు జాబితాను కొలిక్కి తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 

మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని టాక్. పది వరకు బీసీలకు పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు లేదా నాలుగు, మైనార్టీలకు ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన పదవులను కమ్మ, కాపు, రెడ్డి సహా ఇతర మేజర్ సామాజిక వర్గాలకు కేటాయిస్తారు. మళ్లి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈసారి ఉమ్మడి జిల్లాలలను ప్రాధాన్యతగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. 

మంత్రివర్గం జాబితాపై ఒక చర్చ నడుస్తుంటే... అసలు జనసేన అధినేత పవన్‌కు ఎలాంటి పదవి ఇస్తారనే చర్చ మరో ఎత్తు. ఆయన చేపట్టే పదవిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఈమేరకు చర్చలు కూడా పూర్తి అయినట్టు చెబుతున్నారు. ఈసారికి ఆయన ఒక్కడినే ఉపముఖ్యమంత్రిగా ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్లు. ఈసారి మాత్రం పవన్ కల్యాణ్ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక్కడికే ఆ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు. 

పవన్ ఉప ముఖ్యమంత్రి కేటాయిస్తున్న టీడీపీ అధినేత... మరో మూడు మంత్రిపదవులు ఆ పార్టీకి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు పవన్‌తోపాటు ఆ పదవులు చేపట్టేది ఎవరనే చర్చ నడుస్తోంది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కూర్పు ఉంటుందని ఈ నలుగురు కూడా నాలుగు సమాజిక వర్గాల నుంచి పదవీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. పవన్‌తో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్న నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 

బీజేపీకి కూడా చంద్రబాబు రెండు మంత్రిపదవులు ఇవ్వబోతున్నారు. కేంద్రంలో రెండు మంత్రిపదవులు తీసుకున్నందును రాష్ట్రంలో కూడా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ అధినాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ఓకే అన్న తర్వాత ఇక్కడ వాళ్లకు పదవులు ఇవ్వాలా... ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై క్లారిటీ వస్తుందని కూడా చెబుతున్నారు. 

తెలుగుదేశం విషయానికి వస్తే ఈసారి పోటీ చాలా గట్టిగానే ఉంది. ఓవైపు ఆఖరి ఛాన్స్ అన్నట్టు సీనియర్లు మంత్రిపదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే... ఉజ్వల రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా తమకు స్థానం కల్పించాలని యువ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఇంకోవైపు మహిళలు కూడా గతం కంటే ఎక్కువ మంది ఎన్నిక కావడంతో వారి నుంచి కూడా ఒత్తిడి ఉంది. వీటిని చూసుకుంటూనే సామాజిక సమీకరణాలు చూసుకొని జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఆ కసరత్తును చంద్రబాబు ఎప్పుడో చేశారని టాక్ నడుస్తోంది 

135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 20 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో లోకేష్‌, నారాయణకు మంత్రిపదవులు ఖాయం అయ్యాయి. అంటే ఇంకా 18 పదవులకు మిగతా వాళ్లు పోటీ పడాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదు. గత సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు మంత్రిపదవులు ఇచ్చే వారితో ముఖాముఖీగా మాట్లాడేవాళ్లు. ఈసారి మాత్రం అలాంటి సమావేశాలు జరగలేదు. 

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget