అన్వేషించండి

Somu Veerraju: ఏపీలో పొత్తులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు - అందుకే కట్టుబడి ఉంటామని వెల్లడి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వం, అవినీతి, అక్రమాలపై అభియోగాల సేకరణ ప్రజా చార్ట్ షీట్ కార్యక్రమం పల్నాడు జిల్లా, గురజాల పట్టణంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను గురజాల ఆర్డీవోకు సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు.

పొత్తుల నిర్ణయం అధిష్ఠానం చూసుకుంటుంది - సోము

వైసీపీ ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు, రానున్న ఎన్నికలలో పొత్తుల విషయమై బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కట్టుబడి ఉంటుందని అన్నారు.

కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళించింది

సాగరమాల పథకం కింద జాతీయ రహదారులు పల్నాడు ప్రాంతంలో కూడా కేంద్రం నిర్మించింది. పల్నాడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు అందించి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు నిర్మించాలని కేంద్రం భావిస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించే విధంగా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో అనేక మంది భూములు కబ్జాకి గురి అయినట్లు తన దృష్టికి వచ్చాయని అన్నారు.
దీనిపై ఆర్డిఓకి సమస్యలను నివేదిస్తూ ఈరోజే అర్జీలు దాఖలు చేశామని.. అధికారులు సానుకూలంగా వ్యవహరించి భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ భూకబ్జాలు సహజ వనరుల దోపిడీ అరాచకంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వ తీరు మారాలి
ప్రభుత్వం, స్థానిక నాయకుల తీరుపై ప్రజల నుండి అనేక అభియోగాలు వచ్చాయన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు ఆర్భాటాలకు ఖర్చు చేసి అధికారం దిశగా చేస్తున్న ఈ దుర్మార్గ పాలనను ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దళిత కుటుంబాలకు సంబంధించిన మూడు ఎకరాల భూమి ఏళ్ల తరబడి సాగులో ఉన్నప్పటికీ తాజాగా వైసీపీ పాలనలో సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయి కబ్జాలకు గురయ్యే దిశగా పాలన సాగుతుందని తెలిపారు.

గ్రామ సుపరిపాలన గాడి తప్పింది
‘‘గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు కరెంటు బిల్లుల పేరుతో గ్రామపంచాయతీ నిధులను కూడా కాజేశారు. గ్రామపంచాయతీ సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా గ్రామ సర్పంచులకు ఆర్థిక స్వావలంబన లేకుండా, గ్రామాల అభివృద్ధి కుంటుపడే విధంగా కుటిల సాకులతో దుర్మార్గాలకు పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని మంత్రిత్వ శాఖల నుండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చురుకుగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది’’ అని అన్నారు.

అభివృద్ధికి సహకరించని రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి జిల్లాలో 1200 కోట్లకు పైబడి నిధులు ఉపయోగించి జల్ జీవన్ మిషన్ పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లకు గుర్తింపు లేకుండా పోయింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో  కూడా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలపై  రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన చార్జిషీట్లు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన గన్నవరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సోము వీర్రాజు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Embed widget