అన్వేషించండి

Sajjala Ramakrishna Reddy: ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా? ఓట్ల లెక్కింపుపై సైతం సజ్జల అనుమానాలు!

Andhra Pradesh Elections: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, టీడీపీ దాడులు చేస్తుంటే పోలీసులు సైతం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy comments on Election Commission: తాడేపల్లి: ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ శ్రేణులు వైసీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఎక్కడైతే పోలీసు ఉన్నతాధికారుల బదిలీ జరిగిందో అక్కడే ఎక్కువ దాడులు జరిగాయని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరించింది. టీడీపీ గూండాలు దాడులు జరిపినా, పోలింగ్ ను ప్రభావితం చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే ఓట్ల లెక్కింపుపై సైతం వైసీపీ తరఫున సజ్జల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపులో సైతం ఏదైనా కుట్ర జరగొచ్చు అని వ్యాఖ్యానించారు.

కూటమి నేతల పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరు !
‘ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు  దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలు ఇచ్చిన పార్టీకి పోలీసులు, పరిశీలకులు హాజరయ్యారు. మరోవైపు వారం రోజుల కిందట పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీని ఈసీ బదిలీ చేసింది. కొత్త వారికి రాష్ట్రంపై కనీస అవగాహన కూడా లేదు. తెలుసుకునే టైం కూడా వారికి దొరకలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి చెప్పిన చోటే పోలిసుల బదిలీ జరిగింది. పోలీస్ అధికారులను ఎక్కడ మార్చారో అక్కడే ఎక్కడ గొడవలు, హింస జరిగాయి. అంటే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని మేం ఎలా నమ్మాలి. ఎన్నికల రోజు నుంచి టీడీపీ చేస్తున్న దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని’ సజ్జల వివరించారు. 

టీడీపీ దాడులు చేస్తుంటే.. వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

పోలింగ్‌ రోజు ఓవైపు టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరుగుతుంటే.. వైసీపీ నేతలను మాత్రం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న వారిపై దాడులు జరగడం పోలీసులు, ఈసీ వైఫల్యాలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కడప, పల్నాడు, చంద్రగిరి సహా పలు ప్రాంతాల్లో ఈసీ వైఫల్యం కారణంగా గొడవలు జరిగాయి, కనుక ఈసీనే వీటికి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీపై దాడి జరిగినా చర్యలు లేవు. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. 

పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని సైతం బదిలీ చేశారు. మొత్తం 29 మంది అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. సుజనాచౌదరికి దగ్గరి మనిషి, రిటైర్డ్ ఆఫీసర్ అయిన విష్ణువర్ధనరావు ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లడాన్ని సజ్జల ప్రస్తావించారు. టీడీపీ కూటమి ప్లాన్ లను దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందని ఆరోపించారు. పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు వస్తే, ఎవరిపైనా విచారణ చేయకుండానే వెంటనే వెంటనే బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ సజావుగా జరుగుతుందో లేదో నని ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
The Raja Saab Box Office Collection Day 8: బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
Dog Viral Video:హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
RBI jobs: పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
BMC Results:ముంబైని కైవసం చేసుకున్న బీజేపీ, ఠాక్రే సోదరులకు షాక్; దూసుకెళ్లిన ఓవైసీ 'పతంగ్'!
ముంబైని కైవసం చేసుకున్న బీజేపీ, ఠాక్రే సోదరులకు షాక్; దూసుకెళ్లిన ఓవైసీ 'పతంగ్'!
Embed widget