అన్వేషించండి

Posani On Lokesh: నన్ను మర్డర్ చేయించాలని చూస్తున్నారు - లోకేశ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు

మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

తనను చంపడానికి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు, వైఎస్ఆర్ సీపీ నేత పోసాని క్రిష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే లోకేశే బాధ్యత వహించాలని అన్నారు. మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పోలీసులపై దాడిచేయించినట్లుగా పోసానిని మర్డర్ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం నచ్చి ఆయన వద్దకు వెళ్లానని అన్నారు. తన జీవితాంతం వైఎస్‌ జగన్‌ వెంట ఉంటానని అన్నారు. చావుకు తాను ఎప్పుడూ భయపడబోనని పోసాని తేల్చి చెప్పారు. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని చూస్తున్నారని అన్నారు. మంగళగిరికి వచ్చిన సమయంలో ఏదో ఒకప్పుడు తనను చంపాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. చావుకు తాను భయపడబోనని అన్నారు.

చంద్రబాబు అక్రమాలు తాను బయట పెట్టినందుకే తనపై కక్ష గట్టారని చంద్రబాబు, లోకేష్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని నేను అన్నానని లోకేశ్ తనపై పరువు నష్టం దావా వేశారని పోసాని అన్నారు. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారని, అందుకే ఎన్ని కేసులు ఉన్నాకానీ అన్నిటిపైనా స్టే లు రావడం వల్ల జైలుకు వెళ్లలేదని అన్నారు.

ఇంకా కొంత మందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని అన్నారు. గతంలో సీఎం జగన్‌ కాన్వాయ్ వెళ్లినపుడు పసుపు నీళ్లతో కడిగించారని అన్నారు. కులాభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదని అన్నారు. పెదకాకానిలో తనకు 16 ఎకరాలు ఉన్నాయని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాసిస్తానని అన్నారు. తనకు సొంతూరు పెదకాకానిలో పొలాలు లేవని.. స్థలాలు మాత్రం ఉన్నాయని అన్నారు.

హెరిటేజ్ పైనా విమర్శలు

లోకేశ్ కి తెలియకుండానే లోకేశ్ తల్లి, భార్య హెరిటేజ్‌కి డైరెక్టర్లు అయ్యారా అని ప్రశ్నించారు. హెరిటేజ్ చంద్రబాబుది అంటే ఆ సొమ్ము లోకేశ్ ది కాదా అని అడిగారు. నేను చచ్చిపోతే నా ఆస్తి నా తర్వాత నా కొడుకుకి వచ్చినట్లే హెరిటేజ్ లోకేశ్‌కి చెందుతుంది కదా అని అన్నారు. 

అమరావతిలో 5 శాతం భూములు పేద ప్రజలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని పోసాని అన్నారు. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని అన్నారు. గతంలో రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు అతీతంగా రూ.11 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశారని గుర్తు చేశారని అన్నారు. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని రైతులు చెప్పారా? అని ప్రశ్నించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయని, తన కష్టార్జితంతో వాటిని కొన్నానని అన్నారు. అవసరమైతే ఆ భూములన్నీ పేదలకు ఫ్రీగా ఇచ్చేస్తానని అన్నారు. పేదల భూములపై కేసులు వెనక్కి తీసుకోవాలని అమరావతి రైతులను పోసాని కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Embed widget