అన్వేషించండి

Posani On Lokesh: నన్ను మర్డర్ చేయించాలని చూస్తున్నారు - లోకేశ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు

మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

తనను చంపడానికి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు, వైఎస్ఆర్ సీపీ నేత పోసాని క్రిష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే లోకేశే బాధ్యత వహించాలని అన్నారు. మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పోలీసులపై దాడిచేయించినట్లుగా పోసానిని మర్డర్ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం నచ్చి ఆయన వద్దకు వెళ్లానని అన్నారు. తన జీవితాంతం వైఎస్‌ జగన్‌ వెంట ఉంటానని అన్నారు. చావుకు తాను ఎప్పుడూ భయపడబోనని పోసాని తేల్చి చెప్పారు. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని చూస్తున్నారని అన్నారు. మంగళగిరికి వచ్చిన సమయంలో ఏదో ఒకప్పుడు తనను చంపాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. చావుకు తాను భయపడబోనని అన్నారు.

చంద్రబాబు అక్రమాలు తాను బయట పెట్టినందుకే తనపై కక్ష గట్టారని చంద్రబాబు, లోకేష్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని నేను అన్నానని లోకేశ్ తనపై పరువు నష్టం దావా వేశారని పోసాని అన్నారు. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారని, అందుకే ఎన్ని కేసులు ఉన్నాకానీ అన్నిటిపైనా స్టే లు రావడం వల్ల జైలుకు వెళ్లలేదని అన్నారు.

ఇంకా కొంత మందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని అన్నారు. గతంలో సీఎం జగన్‌ కాన్వాయ్ వెళ్లినపుడు పసుపు నీళ్లతో కడిగించారని అన్నారు. కులాభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదని అన్నారు. పెదకాకానిలో తనకు 16 ఎకరాలు ఉన్నాయని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాసిస్తానని అన్నారు. తనకు సొంతూరు పెదకాకానిలో పొలాలు లేవని.. స్థలాలు మాత్రం ఉన్నాయని అన్నారు.

హెరిటేజ్ పైనా విమర్శలు

లోకేశ్ కి తెలియకుండానే లోకేశ్ తల్లి, భార్య హెరిటేజ్‌కి డైరెక్టర్లు అయ్యారా అని ప్రశ్నించారు. హెరిటేజ్ చంద్రబాబుది అంటే ఆ సొమ్ము లోకేశ్ ది కాదా అని అడిగారు. నేను చచ్చిపోతే నా ఆస్తి నా తర్వాత నా కొడుకుకి వచ్చినట్లే హెరిటేజ్ లోకేశ్‌కి చెందుతుంది కదా అని అన్నారు. 

అమరావతిలో 5 శాతం భూములు పేద ప్రజలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని పోసాని అన్నారు. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని అన్నారు. గతంలో రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు అతీతంగా రూ.11 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశారని గుర్తు చేశారని అన్నారు. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని రైతులు చెప్పారా? అని ప్రశ్నించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయని, తన కష్టార్జితంతో వాటిని కొన్నానని అన్నారు. అవసరమైతే ఆ భూములన్నీ పేదలకు ఫ్రీగా ఇచ్చేస్తానని అన్నారు. పేదల భూములపై కేసులు వెనక్కి తీసుకోవాలని అమరావతి రైతులను పోసాని కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget