అన్వేషించండి

PM Modi AP Tour: నేడు అమరావతికి ప్రధాని మోదీ, రాజధాని పనులకు శ్రీకారం, అనంతరం భారీ బహిరంగ సభ- పూర్తి షెడ్యూల్

PM Modi AP Tour Update: నేడు అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. రాజధాని పున:ప్రారంభానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

పైలాన్ ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ 

ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్  ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు.  ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం రాత్రి 10 గంటలకు సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ మరోసారి పరిశీలించారు. నేటి కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చే వారి కోసం 3531 ఆర్టీసీ బస్సులు, 4050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దూరప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

అసలే వేసవికాలం కావడంతో ప్రధాని మోదీ సభకు వచ్చే వారి కోసం ఆహారం, తాగునీరు, ORS సిద్ధం చేశారు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ నేడు అనుకోకుండా వర్షం పడినా, వచ్చిన ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంచారు. 


ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్
-  ప్రధాని మోదీ నేటి మధ్యాహ్నం 2.55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఏపీ మంత్రులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. 

-  ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో అమరావతి సచివాలం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు.

- మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతి పునర్ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

- గంటా 15 నిమిషాల పాటు బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి  చేరుకుంటారు.

- గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరతారు.

అమరావతి: ఏపీ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ రాష్ట్ర అసెంబ్లీ, శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేల గృహ సముదాయాలకు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనులతో పాటు ఇతర రూ.57,962 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.  

నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు, విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన, రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులను తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఖాజీపేట–విజయవాడ 3వ లైన్ ప్రారంభం, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నార. ప్రధాన మోదీ అమరావతి పర్యటన సందర్భంగా విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఎవరు ఏ రూట్‌లో వెళ్లాలి అనేది విజయవాడ సీపీ వాహనదారులకు సూచించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget