అన్వేషించండి

Pawan Kalyan: జగన్ నువ్వెంత? నీ బతుకెంత? ప్రజలే కొట్టి చంపేస్తారు - పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan: ‘జగన్.. నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? సీఎం పదవి ఉందని ఫీలై పోవద్దు. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు’ అని పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటు  విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జగన్.. నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? సీఎం పదవి ఉందని ఓ ఫీలై పోవద్దు. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో సారి వైసీపీ, జగన్ గెలిస్తే ఏపీ ప్రజలు భరించగలరా అంటూ ప్రశ్నించారు. తాను టీడీపీతో పొత్తు కోసం తహతహలాడలేదన్నారు. టీడీపీతో పొత్తు ఆమోదించినందుకు జనసేన కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 

‘జగన్ మానసిక రోగి’
సీఎం జగన్ కు అదో రకమైన మానసిక సమస్య ఉందని, దాన్ని పిచ్చి అంటారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్రంలో మాట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మెడికల్ టీమ్ ను ఏపీకి పంపించి జగన్‌ను చెక్ చేయాలని కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఏదైనా ప్రశ్న అడిగితే, చేతిలో పేపర్ లేకపోతే సరిగ్గా సమాధానం చెప్పలేని వ్యక్తి జగన్ అని, మానసిక పరిస్థితి సరిగ్గా లేని అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు. ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదన్నారు.

Pawan Kalyan: జగన్ నువ్వెంత? నీ బతుకెంత? ప్రజలే కొట్టి చంపేస్తారు - పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

‘చనిపోవడానికి సిద్ధపడే పార్టీ‘
చనిపోవడానికి సిద్ధమై పార్టీ పెట్టినట్లు పవన్ అన్నారు.  2014లో పార్టీ పెట్టినప్పుడు తన పక్కన ఎవరూ లేరని, తాను ఒక్కడినే ఉన్నా అన్నారు. మరణానికి సిద్ధపడే ఆ రోజు పార్టీ పెట్టానని, ఈ రోజు సత్యాన్ని ఆవిష్కరింపజేస్తున్నా అని అన్నారు. ఈ పోరాటంలో తనను పంచేసినా పర్లేదని, చైతన్యం లేకుండా పిరికితనంతో ఉన్న తెలుగుజాతిని మేల్కొలపడానికి తెగిస్తానని అన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న ఓ పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని, సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని చెప్పారు. 

‘ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాలి’
మన దేశం అన్ని ధర్మాలను స్వీకరించిందని, రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వారి కోసమే ఇదంతా చెబుతున్నట్లు పవన్‌ కల్యాణ్ వివరించారు. వైసీపీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే రాజ్యాంగ ప్రతి తెచ్చానని పార్టీనేతలకు వివరించారు. అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కొందరి భావిస్తున్నారని, చేసే పని సరైందే అని ఐపీఎస్‌ అధికారులకు అనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గు పడాలని అన్నారు. ఎన్ని తిట్టినా భరించామని, పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, సొంత రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని పవన్ ధ్వజమెత్తారు.

‘అది నా బాధ్యత’
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితల గురించి వివరించేందుకు ఢిల్లీ వెళ్తానన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అమిత్ షా, జేపీ నడ్డాకు వివరిస్తానని, పొత్తు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తెలియజేస్తానని పవన్ అన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయని, వాటిని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో తాము ఉన్నామని, పొత్తు అంశాన్ని వారికి వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇండియా భారత్‌ పేర్ల మార్పుపై దేశమంతా చర్చించుకుంటున్నారని, ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందన్నారు. బ్రిటీష్‌ వారికి భారత్‌ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 

‘పరిస్థితుల దృష్ట్యా సనాతన ధర్మం మారుతుంది’
తాను ఎప్పుడు భారతీయుడిగానే మాట్లాడుతానని, 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని పవన్ అన్నారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని అన్నారు. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని, మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది. 

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget