అన్వేషించండి

Temples In AP: ఏపీలో దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అధికారులకు ఆగస్టు వరకే డెడ్‌లైన్‌

అన్నిరకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూముల బుకింగ్ తదితర సేవలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్న ప్రభుత్వం. అవసరమైన సాఫ్ట్‌వేర్ కూడా అభివృద్దికి చర్యలు

ఏపీలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు మాసాంతానికల్లా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఉపముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొట్టు సత్యనారాయణ... దేవాలయాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా టి.టి.డి. తరహాలో అన్ని రకాల సేవలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఎనిమిది ప్రధాన దేవాలయాలు, 6(ఎ) కేటగిరీలోని 180 దేవాలయాల్లో అన్నిరకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూముల బుకింగ్ తదితర సేవలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా దేవాలయాల్లో జరిగే ఆర్థిక లావాదేవీల ఖాతాలు అన్నింటినీ అన్ లైన్ ద్వారా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ కూడా అభివృద్ది పరుస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో జరిగే ఆర్థిక వ్యవహారాలను పూర్తిస్థాయిలో ఆడిటింగ్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు సత్యనారాయణ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ పూర్తిచేసి ఆడిట్ రిపోర్టులను సత్వరమే అందజేయాలని ఆదేశాలు జారిచేసినట్టు పేర్కొన్నారు. 6(ఎ) కేటగిరీలోని 195 దేవాలయాలకు సంబంధించి 185 దేవాలయాల ఆడిట్ రిపోర్టులు ఇప్పటికే అందాయని, 6(బి) కేటగిరీలోని 1,461 దేవాలయాలకు సంబంధించిన ఆడిట్ ఈ ఏడాది నవంబరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆడిట్  నివేదికలను అన్నింటినీ ఆన్ లైన్‌లో పెడతామని, నివేదికల్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వెంటనే వివరణ ఇవ్వాల్సినదిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఆయన తెలిపారు. 

అర్చకుల సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా అర్చకులకు పలు రకాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు సత్యనారాయణ.  2021-22 ఆర్థిక సంవత్సరంలో 719 మంది అర్చకులకు లబ్ది చేకూర్చే విధంగా రూ.16.96 కోట్లు, ఈ ఏడాది ఇప్పటి వరకూ  158 మంది అర్చకులకు లబ్ది చేకూర్చే విధంగా రూ.3.20 కోట్లు వెచ్చించామన్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సుమారు 11 వేల ఫైళ్లను పరిష్కరించామని మంత్రి తెలిపారు.  

కోటి రూపాయలలోపు ఆదాయం ఉన్న ఐదు దేవాలయాలను ధార్మిక పరిషత్ కమిటీ ద్వారా ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఉపముఖ్యమంత్రి తెలిపారు. కోటబొమ్మాళి కొత్త అమ్మవారి దేవాలయం, శాండ్ హిల్ రామ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, విశాఖపట్నం వెలంపేట దుర్గాలమ్మవారి దేవాలయం, పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయం, ఆరుగొండ అర్థగిరి వీరాంజనేయ స్వామి దేవాలయాలకు ధార్మిక పరిషత్ కమిటీ ద్వారా ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేశారు. 

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలకు సంబంధించి దాదాపు 6 లక్షల ఎకరాల దేవాదాయ భూముల ఉన్నాయని, వాటిలో 2 లక్షల ఎకరాలు అర్చకుల యాజమాన్యంలో ఉన్నాయని వెల్లడించారు. మరో 2 లక్షల ఎకరాలు పలు లిటిగేషన్లలో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేవాదాయ భూముల ఆక్రమణను పటిష్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్ట సవరణకు చర్యలు చేపట్టామని త్వరలోనే ఆప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖా పరంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం రెండు రోజులు పాటు అంటే సోమవారం, మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ లేకుండా సి.జి.ఎఫ్.  
ఇవ్వకూడదనే నిబంధనలకు అనుగుణంగానే మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టిన దేవాలయాలు అన్నింటికీ నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. సి.జి.ఎఫ్. గ్రాంట్‌గా రూ.120 కోట్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.  సి.జి.ఎఫ్. కింద రూ.167 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని, ఈ నెలఖారు కల్లా కనీసం రూ.100 కోట్లు వసూలు చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్థేశించామన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SMAM Scheme: 50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Udyogini Scheme 2026: రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
Embed widget