అన్వేషించండి

Guntur Politics: గుంటూరులో కుండమార్పిడి రాజకీయం! పార్టీలు మారే యోచనలో ఎంపీ, మాజీ ఎంపీలు!

ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత బావిస్తున్నారట!

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోన్నున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రముఖ నాయకులు గేటు దూకనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత భావిస్తున్నారట!

నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికలలో విజయం సాధించారు. పార్టీ ఆరంభం నుంచి దేవరాయలు పార్టీతోనే ఉన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధిపతిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పరిచయం. నర్సారావుపేట ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత పార్టీలో లుకలుకలుకలతో ఇబ్బందులకు గురౌతున్నారు దేవరాయలు. చిలకలూరిపేట నియోజకవర్గం నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న  ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదట. ఆ నియోజవర్గ ఎమ్మెల్యే విడదల రజనీకి, ఎంపీకి మద్య గ్యాప్ అంతకతకూ పెరుగుతుంది. తన పర్మిషన్ లేకుండా తన నియోజకవర్గంలోకి ఎంపీ ఎలావస్తారని అనేక సార్లు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి.

పార్టీ మారతారని ఉహాగానాలు
లావు కృష్ణ దేవరాయలు ఊహించింది ఒకటి జరుగుతుంది మరొకటి. గత టీడీపీ ప్రభుత్వంలో నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణకు ఇచ్చినంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వంలో దక్కుతుందని భావించి భంగపడ్డారు దేవరాయలు. ఎంపీ కమ్మ సామాజిక వర్దానికి చెందినవారు కావడంతో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారట. మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం కూడా ప్రయత్నించి భంగపడ్డారట. తన మాటకు పార్టీలో విలువ లేకపోవడం తీవ్రంగా బాధిస్తుందట. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళతారన్న వార్తలు లోకల్ గా హల్ చల్‌ చేస్తున్నాయి.

ఇప్పటికే టీడీపీ అధిష్ఠానంతో టచ్ లో ఎంపీ ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి రెండోసారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీకూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తుందట. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కమ్మ కులానికి చెందిన వారైతే విజయం తథ్యమని టీడీపీ భావిస్తుంది. కులం కూడా తోడవటంతో వైసీపీ నుంచి టీడీపీలోకి లావు దేవరాయలు జంప్ అవుతున్నారని, గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నరన్న టాక్ అయితే వినపడుతోంది.

ఆదరించని ప్రజలు
టీడీపీ నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి లావు కృష్ణ దేవరాయలు చేతిలో రాయపాటి సాంబశివరావు ఓడిపోయారు. 2014, 2019 రెండు సార్లు నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ಓడిపోయారు రాయపాటి. కాంగ్రెస్ పార్టీ లో జిల్లాను శాసించిన వ్యక్తి రాయపాటి. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన చరిత్ర ఆయనది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014లో టీడీపీలో జాయిన్ అయిన నుంచి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది రెండు సార్లు పోటీ చేసి ಓడిపోవడం ఒక కారణం అయితే.. వయోభరం, కొత్త తరం రాజకీయం మరో కారణం. తన బద్ద శత్రువు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం.. జిల్లా నాయకులంతా అయనతో టచ్ లోకి వెళడంతో అసలు ప్రాధాన్యం లేకుండా పోయిందని రాయపాటి భావిస్తున్నారట.

సీట్లకు గ్యారంటీ లేదని

తనకు ఎంపీ సీటు, తన కుమారుడు, కోడలకి ఎంఎల్ఏ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం అవమానంగా భావిస్తున్నారట. వైసీపీలోకి వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వైసీపీ అధిష్ఠానం వరకు తన విన్నపాన్ని పంపారట. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఒకే పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యర్థులుగా పోటీ చేసిన అ ఇద్దరూ కుండ మార్పిడి లాగా సొంత పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన రాజకీయ భీష్ముడు రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి.. యువ ఎంపీ వైసీపీ నుంచి టీడీపీ లోకి వస్తున్నారన్న వార్తలు మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సందడి చేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget