అన్వేషించండి

Guntur Politics: గుంటూరులో కుండమార్పిడి రాజకీయం! పార్టీలు మారే యోచనలో ఎంపీ, మాజీ ఎంపీలు!

ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత బావిస్తున్నారట!

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోన్నున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రముఖ నాయకులు గేటు దూకనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత భావిస్తున్నారట!

నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికలలో విజయం సాధించారు. పార్టీ ఆరంభం నుంచి దేవరాయలు పార్టీతోనే ఉన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధిపతిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పరిచయం. నర్సారావుపేట ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత పార్టీలో లుకలుకలుకలతో ఇబ్బందులకు గురౌతున్నారు దేవరాయలు. చిలకలూరిపేట నియోజకవర్గం నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న  ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదట. ఆ నియోజవర్గ ఎమ్మెల్యే విడదల రజనీకి, ఎంపీకి మద్య గ్యాప్ అంతకతకూ పెరుగుతుంది. తన పర్మిషన్ లేకుండా తన నియోజకవర్గంలోకి ఎంపీ ఎలావస్తారని అనేక సార్లు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి.

పార్టీ మారతారని ఉహాగానాలు
లావు కృష్ణ దేవరాయలు ఊహించింది ఒకటి జరుగుతుంది మరొకటి. గత టీడీపీ ప్రభుత్వంలో నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణకు ఇచ్చినంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వంలో దక్కుతుందని భావించి భంగపడ్డారు దేవరాయలు. ఎంపీ కమ్మ సామాజిక వర్దానికి చెందినవారు కావడంతో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారట. మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం కూడా ప్రయత్నించి భంగపడ్డారట. తన మాటకు పార్టీలో విలువ లేకపోవడం తీవ్రంగా బాధిస్తుందట. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళతారన్న వార్తలు లోకల్ గా హల్ చల్‌ చేస్తున్నాయి.

ఇప్పటికే టీడీపీ అధిష్ఠానంతో టచ్ లో ఎంపీ ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి రెండోసారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీకూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తుందట. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కమ్మ కులానికి చెందిన వారైతే విజయం తథ్యమని టీడీపీ భావిస్తుంది. కులం కూడా తోడవటంతో వైసీపీ నుంచి టీడీపీలోకి లావు దేవరాయలు జంప్ అవుతున్నారని, గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నరన్న టాక్ అయితే వినపడుతోంది.

ఆదరించని ప్రజలు
టీడీపీ నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి లావు కృష్ణ దేవరాయలు చేతిలో రాయపాటి సాంబశివరావు ఓడిపోయారు. 2014, 2019 రెండు సార్లు నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ಓడిపోయారు రాయపాటి. కాంగ్రెస్ పార్టీ లో జిల్లాను శాసించిన వ్యక్తి రాయపాటి. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన చరిత్ర ఆయనది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014లో టీడీపీలో జాయిన్ అయిన నుంచి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది రెండు సార్లు పోటీ చేసి ಓడిపోవడం ఒక కారణం అయితే.. వయోభరం, కొత్త తరం రాజకీయం మరో కారణం. తన బద్ద శత్రువు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం.. జిల్లా నాయకులంతా అయనతో టచ్ లోకి వెళడంతో అసలు ప్రాధాన్యం లేకుండా పోయిందని రాయపాటి భావిస్తున్నారట.

సీట్లకు గ్యారంటీ లేదని

తనకు ఎంపీ సీటు, తన కుమారుడు, కోడలకి ఎంఎల్ఏ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం అవమానంగా భావిస్తున్నారట. వైసీపీలోకి వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వైసీపీ అధిష్ఠానం వరకు తన విన్నపాన్ని పంపారట. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఒకే పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యర్థులుగా పోటీ చేసిన అ ఇద్దరూ కుండ మార్పిడి లాగా సొంత పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన రాజకీయ భీష్ముడు రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి.. యువ ఎంపీ వైసీపీ నుంచి టీడీపీ లోకి వస్తున్నారన్న వార్తలు మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సందడి చేస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget