అన్వేషించండి

Tadikonda YSRCP : తాడికొండ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా డొక్కాకు లైన్ క్లియర్ - సిట్టింగ్ ఎమ్మెల్యేకు సంకేతాలు వెళ్లినట్లే !

తాడికొండ నియోజకర్గ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ పేరు ఫైల్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత కూడా ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి ఈ సారి నిరాశే


Tadikonda YSRCP :   తాడికొండ వైఎస్ఆర్‌సీపీ రాజకీయం కొలిక్కి వచ్చేసినట్లయిది.  నియోజకవర్గానికి పర్యవేక్షకుడిగా నియమితుడయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ .. ఇప్పుడు జిల్లా పార్టీ కూడా అద్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పరిణామంతో తాడికొండ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాదేనని తేలిపోయిందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. 
 

వైఎస్ఆర్‌సీపీ నుండి తాడికొండ శాసనసభ్యురాలుగా ఉండవల్లి శ్రీదేవి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.  అయితే ఆమె ఆది నుండి వివాదాల్లో వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ను సీఎం జగన్ స్వయంగా పార్టీలోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో వైద్య రంగంలో ఉన్న ఆమె రాజకీయా పట్ల ఆసక్తి ఉండటంతో వైసీపీ పార్టిలో చేరి రిజర్వుడ్  నియోజకవర్గం అయిన తాడికొండ నుండి పోటీ చేసిన తొలి సారే విజయం సాదించారు. ఆమె ఎంత తొందరగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే  అయ్యారో అంతే వేగంగా వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 

నియోజవర్గంలో స్దానికుడయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో శ్రీదేవికి విభేదాలు వచ్చాయి. బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్, తన నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టడంపై శ్రీదేవి అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాలు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు కలకలం రేపాయి. అదే సమయంలో ఇసుక వ్యవహరంలో కూడా సురేష్ అనుచురులు  ఇష్టాను సారంగా వ్యవహరించటం పై శ్రీదేవి వర్గం బహిరంగంగానే విమర్శలు చేసింది. దీంతో అదిష్టానం వీరి వ్యవహరంలో జోక్యం చేసుకొని సర్దుబాటు చేసింది.అయితే అది ఎంతో సేపు ఆగలేదు. అదే సమయంలో నియోజకవర్గంలో బ్యానర్ల వ్యవహరం తెరమీదకు వచ్చింది. పార్టీ తరపున ఏర్పాటు చేసే బ్యానర్లలో తన ఫోటో లేకపోవటం పై ఎమ్మెల్యే శ్రీదేవి అభ్యంతరం తెలిపారు. అంతే కాదు నియోజకవర్గానికి పార్టీ నాయకులు వస్తే, ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండా రావటం పై కూడ శ్రీదేవి బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. 

ఇలా వరుసగా వివాదాలు తెరమీదకు వచ్చిన సందర్బంలోనే పేకాట క్లబ్ వ్యవహరం కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ విల్లాలో జరిగిన పేకాట క్లబ్ వ్యవహరం తీవ్ర సంచలనం రేకెత్తించింది.దీంతో వరుస వివాదాల్లో ఎమ్మెల్యే పార్టీకి కూడ తలనొప్పిగా మారారు. ఈ సమయంలోనే తాడికొండ నియోజకవర్గానికి పర్యవేక్షకుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను జగన్ నియమించారు.ఈ వ్యవహరం పై కూడా శ్రీదేవి వర్గం నిరసన వెలిబుచ్చింది. స్వయంగా డొక్కాను కూడ శ్రీదేవి వర్గం ఎదురించి,ఘోరావ్ చేసింది. పార్టీ పెద్దలు కూడ డొక్కాకు మద్దతు ఇవ్వటంతో,శ్రీదేవి వర్గం సైలెంట్ కాక తప్పలేదు.

టీడీపీ నుండి వైసీపీ తీర్దం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ మారిన తరువాత  ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. ఆ తరువాత ఆయన తాడికొండ నియోజకవర్గం కు పర్యవేక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు  గుంటూరు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.  గతంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా  మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు.  తనకు పదవి వద్దని ఆమె తేల్చారు.  దీంతో ఆ స్దానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డొక్కాను పార్టి నియమించింది. దీంతో ఈ విదంగా డొక్కా తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పార్టి వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Ramya Krishnan : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
Christmas 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
Embed widget