అన్వేషించండి

Minister Botsa: ఓపీఎస్ అమలు కుదరదు, అప్పుడు తొందరపడి హామీ ఇచ్చేశాం - బొత్స వ్యాఖ్యలు

AP News: ఓపీఎస్ అమలు సాధ్యం కాదని మంత్రి బొత్స అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని తొందరపడి హామీ ఇచ్చామని చెప్పారు.

Minister Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాలతో భేటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని.. సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని అన్నారు. పాత పింఛను విధానాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని బొత్స తేల్చి చెప్పారు. సీపీఎస్ కంటే మెరుగ్గా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ - జీపీఎస్ ను తీసుకువచ్చామని, కొత్త పింఛను పథకంలో మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 

జీపీఎస్ రద్దుపై మరోసారి భేటీ అవుతాం - బొత్స

మంత్రులు చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో తిరస్కరించాయి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో సీపీఎస్ పై ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే చర్చలు ముగిశాయి. జీపీఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారంటీ పింఛను కనీసం రూ. 10 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగి, వారి జీవిత భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకోలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగి చనిపోయినా జీవిత భాగస్వామికి పింఛను సదుపాయాలు కల్పిస్తామనీ చెప్పినా వినలేదని మంత్రి వివరించారు. జీపీఎస్ రద్దుకు ససేమిరా ఒప్పుకునేది లేదని అన్న ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామని బొత్స వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని, తీవ్రమైన కేసులు పెట్టిన అంశాన్ని గురువారం సీఎం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. 

ఉద్యోగులంతా ఓపీఎస్ వైపే మొగ్గు..

చర్చల ద్వారానే పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాల లీడర్లతో భేటీలు నిర్వహిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జీపీఎస్ లో చేసిన మార్పులను పరిశీలించి, జీపీఎస్ అమలుకు ఆమోదించాలని కోరారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జీపీఎస్ తెచ్చామనీ, ఉద్యోగులకు ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సీపీఎస్ రద్దు చేస్తే భారీగా ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు కొనసాగుతాయని యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ అధ్యక్షులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం మార్పు చేసి, ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సీపీఎస్ రద్దు అవుతుందనే వైసీపీని ఎన్నికల్లో గెలిపించుకుని అధికారంలో కూర్చోబెట్టామని అన్నారు. ఉద్యోగులంతా ఓపీఎస్ నే కోరుకుంటున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మరో సారి స్పష్టం చేశారు. 

జీపీఎస్ లో కొత్త ప్రతిపాదనలు..

  • పదవీ విరమణ తర్వాత బేసిక్ సాలరీపై 33శాతం గ్యాంరటీ పింఛను
  • పదేళ్లు సర్వీసున్న ఉద్యోగికి కనీసం రూ.10 వేల పింఛను
  • పింఛను అందుకుంటున్న వ్యక్తి చనిపోతే భాగస్వామికి 60 శాతం పింఛను చెల్లింపు
  • సర్వీసులో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే అదనంగా ప్రమాద బీమా
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget