Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Free Chicken Biryani in Guntur | ఉచితంగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అనడంతో వేలాది మంది గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ వద్దకు చేరుకున్నారు. తిన్నోళ్లకు తిన్నంత పెట్టారు.

Free Chicken biryani and Chicken curry in Guntur అమరావతి: కోడి కూర ఉచితం అనడంతో చికెన్ కొనేందుకు, తినేందుకు భయపడ్డ వారంతా వేల సంఖ్యలో తరలివచ్చారు. చికెన్ బిర్యానీ, కోడి కూర, చికెన్ రోస్ట్, ఉడికించిన కోడి గుడ్లు.. తిన్నోళ్లకు తిన్నంత ఫ్రీ అనగానే సగం నగర జనాభా అక్కడ వాలిపోయింది. అయితే అక్కడ తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, ఉచితం అని ప్రకటించిన నిర్వాహకులా? లేక పోలీసులా ? ప్రభుత్వమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ వద్ద ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ శుక్రవారం చికెన్ మేళా నిర్వహించింది. దీనిపై నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేయడంతో శుక్రవారం జరిగిన చికెన్ బిర్యానీ, చికెన్ మేళాకు ఒక్కసారిగా గుంటూరు నగర వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎంత మంది వచ్చినా చికెన్, బిర్యానీ ఉందని మైకులో అనౌన్స్ చేసినా ప్రజలు ఓపికగా ఉండకపోవడం, త్వరగా ఫుడ్ సర్వ్ చేయాలని తోపులాట జరిగే పరిస్థితి అక్కడ కనిపించడంతో నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. జనం తాకిడి తట్టుకోలేక నిర్వాహకులు గేటు మూసివేశారు.
ఉచిత చికెన్ ప్రచారంతో స్వామి థియేటర్ వద్దకు మాంస ప్రియులు, చికెన్ లవర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టాభిపురం పోలీసులు వారిని నియత్రించడాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. ఆ స్థాయిలో గుంటూరు ప్రజలు చికెన్ మేళాకు తరలివచ్చారని స్థానికులు చెబుతున్నారు. జనాలను కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేయడంతో కొందరు నిర్వాహకులతో గొడవకు దిగారు. మరోవైపు లోపల సైతం వడ్డించే వారితో కొందరు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు..
ఈ చికెన్ మేళాలో ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ట్రేడర్స్ పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, కోడి గుడ్లు తినడం మానేశారు. అయితే బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ఏ ప్రమాదం లేదని చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ విక్రయాలు తగ్గాయి. కానీ ఏ భయం లేకుండా ఉడికించిన కోడిగుడ్లు, చికెన్ తినవచ్చునని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పేర్కొన్నారు. భాష్యం ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత రామకృష్ణ, డాక్టర్లు నిమ్మల శేషయ్య, రాయపాటి మమత, ఏపీ పెడరేషన్ ఛైర్మన్ సురేష్, గుంటూరు పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశ్ర్బాబు, వెంకాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చారావు, తదితరులు పాల్గొన్నారు.
బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్ విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. చికెన్ తింటే అనారోగ్యం బారిన పడతామన్న భయంతో కొన్ని రోజుల నుంచి సగం మంది చికెన్ జోలికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు ట్రేడర్స్ అసోసియేషన్ ఉచిత చికెన్ మేళా నిర్వహించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

