CRDA: అమరావతిలో సీఎస్కే క్రికెట్ , గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలు - భూములు కేటాయించిన సీఆర్డీఏ
Amaravati: అమరావతిలో క్రికెట్, బ్యాడ్మింటన్ అకాడెమీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఆర్డీఏ 50వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

CRDA Meeting: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీలను అమరావతి ఏర్పాటులో చేయడానికి భూములు కేటాఇస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4 , తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిది.
మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపిన అథారిటీ .. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ , మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు నిర్ణయించింది. అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన అమోదం తెలిపారు.
అమరావతి లో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ప్రకాశం బ్యారేజి ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేశారు. భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ అకాడెమీలతోపాటు బీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు , అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటు స్థలం కేటాయించేందుకూ నిర్ణయించారు.
అమరావతి - ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
— I & PR Andhra Pradesh (@IPR_AP) July 5, 2025
హాజరైన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు
మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం
రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4 ,
అమరావతి కోసం అదనంగా చేపడుతున్న భూసమీకరణలో ఏడు గ్రామాల రైతులు తమ అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇటీవల భూసమీకరణ మార్గదర్శకాలను ప్రకటించారు. రైతులు పట్టా (డాక్యుమెంటెడ్) డ్రై ల్యాండ్ ఎకరానికి 1,000 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్ మరియు 250 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్, జరీబు (సాగునీటి లేదా నదీతీర) భూమికి 1,000 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్ మరియు 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ పొందుతారు. అమరావతిలో 10,000 మంది కార్మికులు ప్రస్తుతం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , అర్బన్ ఎక్స్పాన్షన్ వేగంగా సాగుతోందని సీఆర్డీఏ వర్గాలుచెబుతున్నాయి.





















