అన్వేషించండి

Andhra Pradesh: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత- రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయన్న జగన్

YSRCP: నీటిపారుదల స్థలంలో తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నిర్మించారని సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఉదయం భారీ బందోబస్తు మధ్య కూల్చేశారు.

Tadepalli: నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఈ వేకువ జామున పోలీసుల పహారా మధ్య పడగొట్టేశారు. 

సీతానగరం వద్ద ఉన్న వైసీపీ కార్యలయాన్ని ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఇది ఫస్ట్‌ ఫ్లోర్‌ శ్లాబ్ వేయడానికి సిద్ధమవుతున్న టైంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. 


Andhra Pradesh: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత- రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయన్న జగన్

నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని తాను అధికారంలో ఉన్నప్పడు పార్టీకి తక్కువ లీజుతో కట్టబెట్టారని అది చట్టవిరుద్దమనే ఇప్పుడు చర్యలు తీసుకున్నామని అధికార టీడీపీ చెబుతోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా పేర్కొంటున్నారు. 

కూల్చే టైంలో అటుగా కార్యకర్తలు వేరే నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. సీఆర్డీఏ అధికారులు కూల్చే టైంలోనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తొందరపాటు చర్యలు వద్దని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే అధికారులు పని పూర్తి చేశారు. దీనిైప వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉందన్న కారణంతోనే కూల్చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో చంద్రబాబు శాంపిల్‌గా చూపించారని అన్నారు మాజీ సీఎం జగన్. దేశంలోని ప్రజాస్వామ్యులంతా ఈ ఘోరాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. "ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను." అని జగన్ ట్వీట్ చేశారు. 

వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా దురుద్దేశ పూర్వకంగా కూల్చివేయడం రాష్ట్ర చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందంటున్నారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థని లెక్కచేయకుండా చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పతనానికి ఇదే నాందని శాపనార్థాలు పెట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget