అన్వేషించండి

Andhra Pradesh News: అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్ ఆపండి, ఇంకా ఎంతమందిని చంపుతారు: సిపిఎం

AP Capital Amaravati | ఏపీ రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, రైతుల ఆవేదనకు నిదర్శనమే రైతు రామారావు మరణం అని, ల్యాండ్ పూలింగ్ ఆపాలని సీపీఐ డిమాండ్ చేసింది.

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాలయాపన చేస్తున్నదని, దీంతో మనోవేదనకు గురైన రైతు దొండపాటి రామారావు  గుండెపోటుతో మరణించారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు.. 

మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన మందడం రైతు దొండపాటి రామారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించిన సంఘటన ఇప్పుడు రాజధాని ప్రాంతం లో సంచలనం గా మారింది. శనివారం ఆయన భౌతిక కాయాన్ని మందడం లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బాబురావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం. రవి తదితరులు మందడంలో రామారావు నివాసానికి వెళ్లి భౌతిక కాయంపై పుష్పగుచ్చం  ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామారావు మరణం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. 


Andhra Pradesh News: అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్ ఆపండి, ఇంకా ఎంతమందిని చంపుతారు: సిపిఎం

రాజధాని మొదటి దశ పూర్తి కాకుండా రెండో దశకు భూములు తీసుకోవడం తప్పు: సిపిఎం నేతలు

 సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని, వారి సమస్యలను పరిష్కరించడం లేదని తెలిపారు. సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 11 ఏళ్ల తర్వాత రాజధాని అమరావతి సమస్యలు  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగానే ఉన్నాయని, రైతుల, ప్రజలకు  ఇచ్చిన హామీలు నెరవేర లేదని అన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు అభివృద్ధి చేసుకుంటానికైనా అవకాశం ఇవ్వడం లేదని, రైతులు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు.

ఒకవైపు తొలి దశలో సమీకరించిన భూములనే అభివృద్ధి చేయకుండా రెండో దశ పూలింగ్ అంటూ తొలిదశ రైతులను మరింత ఆవేదనకు గురి చేశారని పేర్కొన్నారు. పైగా మందడం చుట్టూ 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు ఉన్నా, ఊరి మధ్యలో నుండి రోడ్డు వేయాలనే పేరుతో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారని ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఇళ్లు కూడా తీసుకుంటామనడంతో తీవ్రవత్తిడికి గురయ్యారని తెలిపారు. గతంలో వారు పోలింగ్ కు ఇచ్చిన భూములకు ఇచ్చిన ప్లాట్లు వాగు ప్రాంతంలో ఉన్నాయని సమావేశంలోనే మంత్రి ముందు రామారావు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని ఆవేదనతో ఉన్న రైతులకు రెండో దశ పూలింగ్ నిర్ణయం మరింత ఒత్తిడికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు రామారావు మరణంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, రెండో దశ పోలింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మందడం గ్రామం మధ్యలో నుండి వెళ్లే రహదారి ఏర్పాటు నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత రాజధానిని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రచార ఆర్భాటంతో మునిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి మరింత ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తమ ఆశలను నెరవేరుస్తుందని రైతులు 
భావించారని, కానీ ఈ ప్రభుత్వం కూడా వారి ఆశలను చేస్తున్నదని అన్నారు.

పదేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా  రాజధాని కి న్యాయం చేయలేదని, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. 11 ఏళ్లలో కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ లో చట్టబద్ధతపై బిల్లు పెడతామని చెప్పారని, అది కూడా చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో తీవ్ర ఆవేదన పెరిగిందని వారి బాధలకు, ఆవేదనకు నిదర్శనమేరైతు రామారావు మరణమని  పేర్కొన్నారు. అమరావతి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి, రాజధాని ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
MAVIGUN: అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే..  --జగన్
అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే.. !  
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
TDP MLAs: టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?
Bhumana Karunakar reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Peddi: పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ
Who will be next PM : మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
మోదీ తర్వాత ప్రధాని ఎవరు? జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలో ఆసక్తికర విషయాలు!
Ranbir Kapoor Ram Look: రామునిగా రణబీర్ కపూర్... లుక్కు చూశారా? పర్ఫెక్ట్ కదూ!
రామునిగా రణబీర్ కపూర్... లుక్కు చూశారా? పర్ఫెక్ట్ కదూ!
Hyderabad Gold Man Vijay Kumar: ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
Embed widget