అన్వేషించండి

Andhra Pradesh News: అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్ ఆపండి, ఇంకా ఎంతమందిని చంపుతారు: సిపిఎం

AP Capital Amaravati | ఏపీ రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, రైతుల ఆవేదనకు నిదర్శనమే రైతు రామారావు మరణం అని, ల్యాండ్ పూలింగ్ ఆపాలని సీపీఐ డిమాండ్ చేసింది.

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాలయాపన చేస్తున్నదని, దీంతో మనోవేదనకు గురైన రైతు దొండపాటి రామారావు  గుండెపోటుతో మరణించారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు.. 

మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన మందడం రైతు దొండపాటి రామారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించిన సంఘటన ఇప్పుడు రాజధాని ప్రాంతం లో సంచలనం గా మారింది. శనివారం ఆయన భౌతిక కాయాన్ని మందడం లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బాబురావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం. రవి తదితరులు మందడంలో రామారావు నివాసానికి వెళ్లి భౌతిక కాయంపై పుష్పగుచ్చం  ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామారావు మరణం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. 


Andhra Pradesh News: అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్ ఆపండి, ఇంకా ఎంతమందిని చంపుతారు: సిపిఎం

రాజధాని మొదటి దశ పూర్తి కాకుండా రెండో దశకు భూములు తీసుకోవడం తప్పు: సిపిఎం నేతలు

 సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని, వారి సమస్యలను పరిష్కరించడం లేదని తెలిపారు. సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 11 ఏళ్ల తర్వాత రాజధాని అమరావతి సమస్యలు  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగానే ఉన్నాయని, రైతుల, ప్రజలకు  ఇచ్చిన హామీలు నెరవేర లేదని అన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు అభివృద్ధి చేసుకుంటానికైనా అవకాశం ఇవ్వడం లేదని, రైతులు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు.

ఒకవైపు తొలి దశలో సమీకరించిన భూములనే అభివృద్ధి చేయకుండా రెండో దశ పూలింగ్ అంటూ తొలిదశ రైతులను మరింత ఆవేదనకు గురి చేశారని పేర్కొన్నారు. పైగా మందడం చుట్టూ 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు ఉన్నా, ఊరి మధ్యలో నుండి రోడ్డు వేయాలనే పేరుతో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారని ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఇళ్లు కూడా తీసుకుంటామనడంతో తీవ్రవత్తిడికి గురయ్యారని తెలిపారు. గతంలో వారు పోలింగ్ కు ఇచ్చిన భూములకు ఇచ్చిన ప్లాట్లు వాగు ప్రాంతంలో ఉన్నాయని సమావేశంలోనే మంత్రి ముందు రామారావు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని ఆవేదనతో ఉన్న రైతులకు రెండో దశ పూలింగ్ నిర్ణయం మరింత ఒత్తిడికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు రామారావు మరణంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, రెండో దశ పోలింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మందడం గ్రామం మధ్యలో నుండి వెళ్లే రహదారి ఏర్పాటు నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత రాజధానిని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రచార ఆర్భాటంతో మునిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి మరింత ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తమ ఆశలను నెరవేరుస్తుందని రైతులు 
భావించారని, కానీ ఈ ప్రభుత్వం కూడా వారి ఆశలను చేస్తున్నదని అన్నారు.

పదేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా  రాజధాని కి న్యాయం చేయలేదని, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. 11 ఏళ్లలో కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ లో చట్టబద్ధతపై బిల్లు పెడతామని చెప్పారని, అది కూడా చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో తీవ్ర ఆవేదన పెరిగిందని వారి బాధలకు, ఆవేదనకు నిదర్శనమేరైతు రామారావు మరణమని  పేర్కొన్నారు. అమరావతి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి, రాజధాని ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget