అన్వేషించండి

కారుణ్య నియామకాల కింద సచివాలయ ఉద్యోగాలు.. త్వరగా పూర్తి చేయాలని జగన్ సూచన

కలెక్టర్ల సహా జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం జగన్.. ఉద్యోగులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఇస్తున్నామని వివరించారు. కారుణ్య నియామకాలు కూడా పూర్తి చేస్తున్నట్ట తెలిపారు.

పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు సీఎం జగన్. కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వివరించారు. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని... ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని సూచించారు. 

జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలన్న సీఎం జగన్... అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఆలస్యానికి ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు హితవుపలికారు. 

జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించామని... ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు సీఎం జగన్. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని తెలిపారు. దీనివల్ల డిమాండ్‌ తెలుస్తుందని... మార్చి 5లోగా ప్రక్రియ పూర్తికి ఆదేశించారు. 

ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు సీఎం జగన్. డిమాండ్‌ను బట్టి... వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు స్థల సేకరణకు వీలు ఉంటుందన్నారు. సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలని పేర్కొన్నారు. 

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని... జూన్‌ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని డెడ్‌లైన్ పెట్టారు సీఎం జగన్. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. దీనికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు  సూచించారు జగన్. 

రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు వర్తించే జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి 8న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. ఒక సీజన్‌లో జరిగిన నష్టాన్నిఅదే సీజన్‌లో ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో ఈ పథకాన్ని డిజైన్ చేశారు. డిసెంబర్‌లో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం ఫిబ్రవరిలో ఇస్తున్నారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చే పథకం జగనన్న తోడు నిధులను ఫిబ్రవరి 22న విడుదల చేస్తారు. ఇప్పటికే 10లక్షలకు వర్తింప జేశారు. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింప చేయనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున  విద్యా దీవెన నిధులు.. మార్చి 22న వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget