అన్వేషించండి

Chandra Babu: మళ్లీ సోమవారం పోలవరం- వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

Andhra Pradesh: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కీలక శాఖల అధికారులతో మాట్లాడారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నట్టు తెలిపారు. 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు ఆదేశించారు.

Polvaram And Anna Canteens: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చేపట్టిన సోమవరం పోలవరంను పునరుద్ధరించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా పోలవరంలో జరుగుతున్న జరిగిన పనులపై నేరుగా పరిశీలించిన తర్వాత ఇకపై వారం వారం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు. 

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమావేసమయ్యారు. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందలో భాగంగా జలవనరుల శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. 

జలవనరుల శాఖాధికారులతో సమావేశమైన చంద్రబాబు... పోలవరం ప్రాజెక్టు పురోగతి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం పనులను పూర్తిగా పక్కనే పడేసిందని... తాము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఇకపై పనుల వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

అసలు ప్రస్తుతం ప్రాజెక్టు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఈ సోమవారం నేరుగా ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులు చెప్పిన వివరాలపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయలేదు. నేరుగా వెళ్లి చూస్తే తప్ప అర్థం కాదని అన్నారు. 

వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు 
చంద్రబాబు తొలి రోజు సంతకం పెట్టిన ఫైల్స్‌లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటి. ఆయా ప్రాంతాల్లో వంద రోజల్లో క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు సెప్టెంబర్‌ 21వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్, అర్బన్ ప్లానింగ్ విభాగం అధికారులను కూడా భాగం చేశారు. గతంలో మాదిరిగానే భవనాల డిజైన్లు ఉండాలని గతంలో నిర్మించిన ఎంత వరకు ఉపయోగకరమో చూడాలన్నారు. ఇవాల్టి నుంచే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

మొదటి రోజు పాత భవనాలను పరిశీలించి అక్కడ పరిస్థితిపై నివేదిక రూపొందించాలి. 19న పాత భవనాల పునరుద్ధరణకు, కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. 30న కొత్త భవనాలన నిర్మానానికి స్థల సేకరణ చేపట్టాలి. ఖాళీ భవనాలు ఉంటే ఎంపిక చేయాలి. జులై 30న క్యాంటీన్లలో భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలి. ఆగస్టు పదిన ఎంపిక చేసిన వారికి పనులు అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 15న సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. సెప్టెంబర్‌ 21లోపు 203 క్యాంటీన్లు ప్రారంభించాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Telugu TV Movies Today: చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Embed widget