అన్వేషించండి

PM Modi AP Tour: ప్రధాని రాకను వ్యతిరేకించట్లేదు, హామీలు అమలు చేయాలంటున్నాం: ప్రత్యేక హోదా సాధన సమితి

PM Modi AP Tour: ప్రధాని రాకను తామేం వ్యతిరేకించట్లేదని.. కాకపోతే ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నట్లు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు.

PM Modi AP Tour: ఏపీలో పార్టీలన్నీ కలిసి బీజేపీకి మద్దతుగా ఉంటున్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఎవరు అడుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను తామేం వ్యతిరేకించడం లేదని.. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవాల్లో, మోడీ అనుకూలమైన వారికి చేసిన పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు.

ఆదానీకి అమ్మడం కోసమే విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారంటూ చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఇవ్వడం కాదు ఇక్కడ డివిజన్ ఎత్తేస్తున్నారని విమర్శించారు. కేకే లైన్, ఒడిశాలో కలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రి సభ ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలా వేధించిందో..  సీఎం జగన్ కు రేపు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. బెదిరించి మరీ తెలుగు వారి ఆస్తులను గుజరాత్ కు అప్పగించారని.. ఆదానికి కట్టబెట్టారని తెలిపారు. 

నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారని సాధన సమితి సభ్యులు అన్నారు. విభజన హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు జరగలేదని వివరించారు. ఇక్కడ పరిశ్రమలు అమ్మడానికి వస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలన్నారు. ఇచ్చిన హామీలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ఆత్మభిమానాన్ని నరేంద్ర మోడీ కాళ్ల దగ్గర దాసోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రత్యేక హోదా కల్పించాలంటున్న తులసి రెడ్డి..

ఏపీ రాష్ట్ర పర్యటన కోసం ఇక్కడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని సూచించారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు విడుదల చేయాలని చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలన్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించాలని వ్యాఖ్యానించారు. 

కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రధాని మంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. ఇటీవల కాలలో రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని వివరించారు. నాలుగు రోజుల కిందట అనంతపురం జిల్లా బొమ్మణహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి 5 మంది రైతు కూలీలు మరణించారన్నారు. నిన్న ఆదివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంటలో విద్యుత్ తీగలు తెగిపడి రెడ్డప్ప రెడ్డి అనే రైతు మరణించారని గుర్తు చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Lionel Messi Record: బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
Embed widget