అన్వేషించండి

AP PRC: పీఆర్సీపై ఎటూ తేలని పంచాయితీ.. ప్రభుత్వంతో మళ్లీ అసంపూర్తిగా ముగిసిన చర్చలు

జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

మంత్రులతో కూడిన ప్రభుత్వ స్టీరింగ్ కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వ కమిటీ ఎదుట పీఆర్సీ సాధన సమితి నేతలు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని కోరింది. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దీంతో మూడు డిమాండ్లపై చర్చించుకొని చెబుతామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అప్పటి వరకూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని వారికి సూచించింది.

అంతకుముందు ప్రభుత్వం మరోసారి పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయింది. దాదాపు గంటన్నర సమావేశమైన ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక, ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

హైకోర్టులో ఉద్యోగులకు ఊరట
మరోవైపు, ఉద్యోగులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించి న పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న "జీతాల రికవరీ" అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది. 

అయితే ప్రభుత్వం  జీతాలు తగ్గబోవని చెబుతోంది. రికవరీ చేసినప్పటికీ జీతాలు తగ్గవని హామీ ఇస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను తక్కువగా నిర్ణయించడం.. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం, ఇప్పటికే ఇచ్చిన ఐఆర్ నుంచి నాలుగు శాతం వెనక్కి తీసుకోవడం వంటి చర్యల వల్ల తగ్గిపోయే ఉద్యోగుల జీతాన్ని పెండింగ్‌లో పెట్టిన డీఏలన్నింటినీ మంజూరు చేయడం ద్వారా కవర్ చేయాలని నిర్ణయించింది. నిజానికి డీఏలకు పీఆర్సీకి సబంధం లేదు. కానీ ప్రభుత్వం తమ పీఆర్సీ ఉద్యోగులకు నష్టం లేదన్న భావన కలిగించడానికి డీఏలను పీఆర్సీలో కలిపి ప్రకటించింది. దీంతో ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయ్యే రికవరీ తక్కువే. కానీ డీఏల రూపంలో రావాల్సిన ప్రయోజనాలన్నీ పోతాయి. 

ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఉద్యోగులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఈ పీఆర్సీ ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రెండు సార్లు విచారణ వాయిదా పడింది. ఇవాళ డివిజనల్ బెంచ్ ముందు విచారణ జరిగింది. జీతాల రికవరీ  వద్దని హైకోర్టు చెప్పడంతో ఉద్యోగులకు డీఏ ఎరియర్స్  వచ్చే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget