అన్వేషించండి

AP PRC: పీఆర్సీపై ఎటూ తేలని పంచాయితీ.. ప్రభుత్వంతో మళ్లీ అసంపూర్తిగా ముగిసిన చర్చలు

జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

మంత్రులతో కూడిన ప్రభుత్వ స్టీరింగ్ కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వ కమిటీ ఎదుట పీఆర్సీ సాధన సమితి నేతలు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని కోరింది. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. జనవరి నెలకు గానూ పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని సూచించింది. అయితే, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దీంతో మూడు డిమాండ్లపై చర్చించుకొని చెబుతామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అప్పటి వరకూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని వారికి సూచించింది.

అంతకుముందు ప్రభుత్వం మరోసారి పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయింది. దాదాపు గంటన్నర సమావేశమైన ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక, ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

హైకోర్టులో ఉద్యోగులకు ఊరట
మరోవైపు, ఉద్యోగులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించి న పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న "జీతాల రికవరీ" అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది. 

అయితే ప్రభుత్వం  జీతాలు తగ్గబోవని చెబుతోంది. రికవరీ చేసినప్పటికీ జీతాలు తగ్గవని హామీ ఇస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను తక్కువగా నిర్ణయించడం.. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడం, ఇప్పటికే ఇచ్చిన ఐఆర్ నుంచి నాలుగు శాతం వెనక్కి తీసుకోవడం వంటి చర్యల వల్ల తగ్గిపోయే ఉద్యోగుల జీతాన్ని పెండింగ్‌లో పెట్టిన డీఏలన్నింటినీ మంజూరు చేయడం ద్వారా కవర్ చేయాలని నిర్ణయించింది. నిజానికి డీఏలకు పీఆర్సీకి సబంధం లేదు. కానీ ప్రభుత్వం తమ పీఆర్సీ ఉద్యోగులకు నష్టం లేదన్న భావన కలిగించడానికి డీఏలను పీఆర్సీలో కలిపి ప్రకటించింది. దీంతో ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయ్యే రికవరీ తక్కువే. కానీ డీఏల రూపంలో రావాల్సిన ప్రయోజనాలన్నీ పోతాయి. 

ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఉద్యోగులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఈ పీఆర్సీ ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రెండు సార్లు విచారణ వాయిదా పడింది. ఇవాళ డివిజనల్ బెంచ్ ముందు విచారణ జరిగింది. జీతాల రికవరీ  వద్దని హైకోర్టు చెప్పడంతో ఉద్యోగులకు డీఏ ఎరియర్స్  వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: ఇతర మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఇతర మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Embed widget