అన్వేషించండి

AP PRC Issue: పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రుల స్టీరింగ్ కమిటీ భేటీ.. చర్చిస్తున్న వివరాలివే..!

మంత్రుల స్టీరింగ్ కమిటీ మంగళవారం పీఆర్సీ సాధన సమితి నేతలతో సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రధాన సమస్య అయిన హెచ్‌ఆర్‌ఏ, రికవరీ అంశాలపై మంత్రులు పీఆర్సీ సాధన సమితి నేతలతో మాట్లాడనున్నారు.

ఏపీలో పీఆర్సీ అంశంపై రగడ కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయింది. ఈ మేరకు వారితో చర్చలు జరిపేందుకు నియమించిన మంత్రుల స్టీరింగ్ కమిటీ మంగళవారం పీఆర్సీ సాధన సమితి నేతలతో సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రధాన సమస్య అయిన హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) స్లాబ్‌లు, రికవరీ అంశాలపై మంత్రులు పీఆర్సీ సాధన సమితి నేతలతో మాట్లాడనున్నారు. అంతేకాక, జనవరి నెలలో పాత విధానం ప్రకారం వేతనాలు ఇవ్వాలని మంత్రులను కోరినట్లు సమాచారం. పీఆర్సీ నివేదిక సైతం బహిర్గతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ స్టీరింగ్ కమిటీ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక, ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

మరోవైపు, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటానికి వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పీఆర్సీపై ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ అనేది ఎప్పటి నుంచో ఉందని, ఉద్యోగులు కూడా న్యాయబద్దంగానే పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడలోని దాసరి భవన్‌లో వామపక్షాలు సదస్సు నిర్వహించాయి. 18 నెలలపాటు మిశ్రా కమిషన్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే.. ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కమిషన్ నివేదికను వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టులో ఉద్యోగులకు ఊరట
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం పోరాడుతున్న ఉద్యోగులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న ‘‘జీతాల రికవరీ’’ అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget