అన్వేషించండి

Adimualpu Suresh: టీడీపీ కార్యకర్తలే రాళ్లు విసిరారు, ఇది పోలీసుల వైఫల్యమే: మంత్రి ఆదిమూలపు సురేష్

యర్రగొండపాలెంలో శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తమ మనోభావాలను దెబ్బతిన్నాయన్నారు. కనుక చంద్రబాబు, లోకేష్ లు దళితులపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ తాము శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. దళితులకు క్షమాపణ చెప్పి యర్రగొండపాలెంలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశామని, కానీ టీడీపీ శ్రేణులు తమపై రాళ్ల దాడి చేశాయని ఆరోపించారు. ఇందులో పోలీసుల వైఫల్యం కూడా ఉందని చెప్పారు. 

ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. కానీ చంద్రబాబు వాహనంపై తాము ఎలాంటి దాడి చేయలేదని, ఈ విషయంపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమని మంత్రి సురేష్ అన్నారు. ప్రతిపక్ష నేత అయి ఉండి చంద్రబాబు రూల్స్ కు విరుద్ధంగా రోడ్లపై మీటింగ్ పెట్టడం సరికాదన్నారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభలలో కొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. 

అవసరం లేకున్నా ఇంటి ముందు చంద్రబాబు కాన్వాయ్ ఆపారన్నారు. పైగా వేలు చూపిస్తూ, మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలను ఆయన రెచ్చగొట్టిన వీడియోలు తమ వద్ద ఉన్నాయన్నారు. వాస్తవానికి దళితులపై చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన చేపట్టామని.. కానీ ప్రతిపక్షనేత చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిందన్నారు. నిన్న జరిగిన రాళ్ల దాడిలో పోలీసుల వైఫల్యం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ శ్రేణుల తరహాలో తాము సహనం కోల్పోతే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. కానీ తాము మాత్రం శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. 

అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త  వాతావరణం ఏర్పడింది. యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో ఆయన అనుచరులు వచ్చారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ మీదకు వచ్చారు. నల్ల బెలూన్లు, టీ షర్టులు ధరించి.. బాబు గో బ్యాక్ ప్లకార్డులతో నిరసన  చేపట్టారు. స్వయంగా సురేష్ కూడా రోడ్డు మీదకు వచ్చారు. ఆయన చొక్కా తీసేసి నిరసన చేపట్టారు. చంద్రబాబు దళితుల్ని అవమానపర్చారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు రోడ్ షోలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరగగా... చంద్రబాబు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

చంద్రబాబు యర్రగొండపాలెం సభపై కేసు నమోదు 
చంద్రబాబు శుక్రవారం యర్రగొండపాలెంలో నిర్వహించిన సభపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతిలేని ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారని డీఎస్పీ దాన కిషోర్ కేసు నమోదు చేశారు. చంద్రబాబు పర్యటనలో రాళ్ల వాగు వద్ద బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంటే.. అప్పటికే చీకటిపడుతుండడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసగించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని, అనుమతి తీసుకోకుండా సభ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget