అన్వేషించండి

ఆక్వా రైతుల సమస్యలపై ఎంపవర్ కమిటీ సమావేశం

ఆక్వారంగంలో సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల‌ని, ఆక్వా రైతులు సంక్షోభంలో చిక్కుకుంటే దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఇబ్బంది పడతాయని అభిప్రాయపడింది కమిటీ.

ఆక్వా రైతుల సమస్యలపై ఏర్పాట‌యిన‌ ఎంపవరింగ్ కమిటీ తొలిసారి భేటీ అయ్యింది. ఆక్వా దాణా రేట్ల పెరుగుదల, ఆక్వా ఉత్పత్తుల విక్రయ ధరలు, దాణా రేట్లపై నియంత్రణ వ్యవస్థ, ఆక్వా రైతుల్లో వ్య‌క్తం అవుతున్న‌ ఆందోళపై చ‌ర్చించారు. కమిషన్ ఏజెంట్ల చేతుల్లో ఆక్వా రైతులు నష్టపోకుండా, రైతులు, దాణా, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 

రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఉన్న అవకాశాలు, ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని క‌మిటిలో మంత్రి పెద్ది రెడ్డి వెల్ల‌డించారు. ఆక్వారంగంలో సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల‌ని, ఆక్వా రైతులు సంక్షోభంలో చిక్కుకుంటే దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఇబ్బంది పడతాయని అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి పై సీఎం ప్ర‌త్యేకంగా దృష్టి సారించారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఆక్వా రైతులకు భారంగా మారిన దాణారేట్లను నియంత్రించడం, ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు దక్కేలా చేయడం కోసం మంత్రులు, అధికారులతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ కమిటీ భేటీ అయినట్టు వివరించారు. 
 
మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో కమిటీ సమావేశమైంది. మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, కారుమూరు నాగేశ్వరరావు, రాష్ట్రప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీతోపాటు మార్కెటింగ్ అవకాశాలు కూడా మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆక్వా రంగానికి ఫీడ్, సీడ్ అందించే పరిశ్రమలకు కూడా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. అపారమైన అవకాశాలు ఉన్న ఆక్వారంగంలో ఆరోగ్యకమైన మార్పులు రావాలని ప్రభుత్వం కోరుకుంటోందని సూచించారు. 

గత మూడున్నర సంవత్సరాల్లో ఆరు సార్లు ఆక్వా దాణారేట్లు పెంచడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని ప్రస్తావించారు.  దాణా రేట్ల విషయంలో నియంత్రణలు లేని పరిస్థితిని కొందరు తయారీదారులు అనుకూలంగా మలుచుకోవడం వల్ల తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. దాణారేట్లు పెరగడం, ఆక్వా ఉత్పత్తుల రేట్లు తగ్గడం వల్ల ప్రతికూల పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. దీనిపై సీఎం సమీక్షించి రైతులకు నష్టం లేకుండా, దాణారేట్ల పెరుగుదలను నియంత్రిస్తూ, ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర అందించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.   

రాష్ట్రంలోని ఆక్వా రంగానికి దాణాను అందిస్తున్న కంపెనీలు, ఆక్వా రైతులతో అధికారులు సమావేశాలు నిర్వహించాలని, దాణా రేట్ల పెరుగుదల సహేతుకంగా జరిగిందా, లేదా అనే విషయాలను అధ్యయనం చేయాలని మంత్రులు సూచించారు. అంతర్జాతీయ ఆక్వా రేట్లకు అనుగుణంగా, దేశీయ పరిస్థితులను పరిశీలించి ఆక్వా ఉత్పత్తుల సరైన రేటు రైతులకు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

రైతు నుంచి నేరుగా ఆక్వా ప్రోసెసింగ్ సంస్థలకు విక్రయాలు జరగకుండా మధ్య దళారులు, కమీషన్ వ్యాపారులు రేట్లను నియంత్రిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, వారి వల్ల రైతుకు అందాల్సిన ధర దక్కడం లేదని అన్నారు. దీనిపైన కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా దాణాకు అవసరమైన ముడి పదార్థాల రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు, దానికి అనుగుణంగా దాణా రేట్లు పెరుగుతున్నాయా, లేక అధికంగా రేట్లను పెంచుతున్నారా అనే అంశాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆక్వా రైతులు సంతోషంగా ఉంటేనే, దానికి అనుబంధంగా ఉన్న దాణా ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు బాగుంటాయని, ఈ విషయంలో పరస్పర అంగీకారంతో దాణారేట్లను, ఆక్వా కొనుగోలు ధరలను నిర్ణయించే ప్రక్రియ ఉండాలన్నారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
Embed widget