అన్వేషించండి

Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం ఒక్కరికే ఇస్తారా- ప్రభుత్వం క్లారిటీ ఏంటీ?

Andhra Pradesh: తల్లికి వందనం పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని..సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై సోషల్‌మీడియా(Social Media)లో జరుగుతోంది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వం( AP GOVT) వివరణ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని...కేవలం గెజిట్ పబ్లికేషన్ (Gazette Notification)మాత్రమే ఇచ్చామని తెలిపింది. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

తల్లికి వందనంపై తప్పుడు ప్రచారమే
కూటిమి పార్టీల ముఖ్య హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు, మూడురోజులుగా  సోషల్‌మీడియా(Social Media)లో విపరీతమైన ప్రచారం జరిగింది. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ప్రభుత్వసాయం అందించనుందని...అందుకు సంబంధించిన జీవో విడుదల చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu)..ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకునే ప్రతిఒక్కరికీ తల్లికి వందనం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇద్దరు, ముగ్గురు చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు కొంత  ఆందోళనకు గురయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

గెజిట్‌ పబ్లికేషన్ మాత్రమే విడుదల
ఒకటి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల తల్లులకు అందించనున్న తల్లికి వందనం పథకానికి ఆధార్‌(Aadhar)ను వినియోగించడానికి ముందుగా కేవలం గెజిట్ పబ్లికేషన్ మాత్రమే విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ(School Education) తెలిపింది. ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని  విద్యాశాఖ కార్యదర్శి కోనశశిధర్‌ తెలిపారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో మాత్రం అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ప్రభుత్వశాఖల్లో పథకాలు అమలకు ఆధార్ వినియోగించినట్లయితే...ఆధార్ చట్టం ప్రకారం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని...అందుకే విడుదల చేశామన్నారు.

ఆధార్ వినియోగించుకోవాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉడాయ్‌ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. లేకపోతే  ఆధార్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. త్వరలోనే తల్లికి వందనం పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ముందుగానే ఆధార్ వినియోగించడానికి ఉన్న అనుమతులన్నీ తీసుకోవడం జరుగుతోందన్నారు. కానీ కొందరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. అసత్య ప్రచారాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీపైనా వెనక్కి తగ్గేది లేదని...ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా...కచ్చితంగా సూపర్‌సిక్స్ (Super 6)పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో  వీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేసి తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే  పింఛన్ పెంపు, ఉచిత ఇసుక పంపిణీ సహా  నైపుణ్య గణన, మెగా డీఎస్సీ హామీలను నెరవేర్చించింది. మరో మూడు కీలక హామీలను ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్నక్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాలు త్వరలో అమలు కానున్నాయి. ఇదే కోవలో తల్లివందనం పథకాన్ని సైతం వీలైనంత త్వరగా అమలు చేయనున్నట్లు  ఏపీ ప్రభుత్వం తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget