అన్వేషించండి

UPSC Mains Result 2024: అవమానం తట్టుకోలేక జాబ్‌కు రాజీనామా - యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా ఏపీ కానిస్టేబుల్ !

UPSC Mains Result 2024: అవమానంతో కుంగిపోలేదు, ఆ జాబ్ ని మించిన స్థాయికి చేరుకోవాలన్న ఏపీకి చెందిన మాజీ కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి కల నెరవేరింది. సివిల్ సర్వీసెస్‌లో 780వ ర్యాంకు సాధించారు.

UPSC Topper Uday Krishna Reddy - అమరావతి: దేశంలో అత్యుత్తమ సర్వీసులైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ - 2023 తుది ఫలితాలలో 1,016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో తెలుగువారు దాదాపు 50 మంది వరకు సెలక్ట్ అయ్యారు. విజేతలు ఒక్కొక్కరిది ఒక్కో విజయగాథ. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించి టాప్ 5లో నిలిచారు. UPSC సివిల్ సర్వీసెస్‌లో 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి అవమానాన్ని తన విజయానికి తొలిమెట్టుగా చేసుకుని విజయతీరాన్ని చేరారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని.. ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల రాసిన పాటను నిజం చేశారు ఆంధ్రా పోలీస్.

సివిల్స్ ర్యాంక్ సాధించిన ప్రకాశం జిల్లా వాసి

ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెనికి చెందిన వారు. చిన్నతనంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్ల వయసులోనే తల్లి జయమ్మ చనిపోయారు. ఆపై ఇంటర్ చదవుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు రెడ్డి సైతం మరణించారు. ఆసమయంలో ఉదయ్, అతడి సోదరుడికి నానమ్మ అండగా నిలిచారు. తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ వారిని చదువుపై ఫోకస్ పెట్టేలా చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కానిస్టేబుల్ జాబ్ కు అప్లై చేశారు. ఎగ్జామ్, ఈవెంట్స్ విజయవంతంగా పూర్తిచేసి కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఉదయ్ కృష్ణారెడ్డి 2013 నుంచి 2018 వరకు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.

జీవితాన్ని మలుపు తిప్పిన అవమానం.. 
కానిస్టేబుల్ గా చేస్తున్న సమయంలో ఓ సీఐ ఉదయ్ కృష్ణారెడ్డితో దురుసుగా ప్రవర్తించారు. తనను టార్గెట్ గా చేసుకుని దాదాపు 60 మంది పోలీసుల ముందు అవమానించడాన్ని తట్టుకోలేకపోయారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలని నిర్ణయానికి వచ్చి అదేరోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేవారు ఉదయ్. పోలీస్ జాబ్ వదిలేశాక, హైదరాబాద్ కు వచ్చి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యారు. రాత్రింబవళ్లు శ్రమించి అందుకు తగ్గ ఫలితాన్ని రాబట్టారు.

దేశంలో అత్యంత కష్టమైన సర్వీసులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఇందులో ర్యాంక్ సాధించారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాలతో జాబ్ మొదలుపెట్టడంతో ఎందరికో డ్రీమ్ నెరవేరుతుంది. అందుకే ఉదయ్ కృష్ణారెడ్డి మొదటి మూడు ప్రయత్నాలలో విఫలమయ్యారు. కానీ ఎలాగైనా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలన్న తపనతో నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. యూపీఎస్సీ తాజాగా ప్రకటించిన 2023 సివిల్ సర్వీసెస్ లో 780వ ర్యాంక్ సాధించారు. ఆయనను ఇండియన్ రెవిన్యూ సర్వీస్‌ (IRS)కు కేటాయించే ఛాన్స్ ఉంది. వచ్చిన ర్యాంక్ తో అక్కడే ఆగిపోకుండా.. జాబ్ లో చేరినా.. ఐఏఎస్ కు ఎంపిక అయ్యేందుకు మళ్లీ ప్రిపేర్ అవుతానని ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget