అన్వేషించండి

AP News: ఏపీలో దేవాలయాల వర్గీకరణ, ఆదాయానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు: మంత్రి కొట్టు

Kottu Satyanarayana: ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ తెలిపారు.

Kottu Satyanarayana: త్వరలో దేవాలయాల వర్గీకరణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల ఆదాయంలో పురోగతి కనిపిస్తుందని ఆయన చెప్పారు.

ఆదాయానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు
ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువ అయిందని, అందుకు అనుగుణంగానే వాటి ఆదాయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తున్నదన్నారు. అయితే ప్రస్తుతం దేవాలయాలకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా భక్తులకు పలు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆదాయానికి అనుగుణంగా వాటి వర్గీకరణను  రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో నున్న దేవాలయాలను వాటి ఆదాయాన్ని బట్టి మూడు కేటగిరీలుగా విభజించి అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు రీజనల్ జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. 
ఆదాయం ఎంతుంటే అంతలా...
 15 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం లోపు దేవాలయాలను అసిస్టెంట్ కమిషనర్, రూ.50 లక్షల కు పైబడి రూ.1.00 కోటి లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను డిప్యూటీ కమిషనర్, రూ.1.00 కోటి కి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షణలో ఉంచుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే  ఇప్పుడు ఆ మూడు కేటగిరీల ఆదాయ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆద్వర్యంలో ఉండే దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.7.00 కోట్ల లోపు, డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలోని దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.7 కోట్లకు పైబడి రూ.12 కోట్ల లోపు,  రూ.12.00 కోట్ల ఆదాయానికి మించిన దేవాలయాలను  జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు. ఈ వర్గీకరణ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 5 వరకూ, డిప్యూటీ కమిషనర్ పోస్టులు 15 వరకూ పెరగనున్నాయని, ఒక రీజనల్ జాయింట్ కమిషనర్ పోస్టు తగ్గనుందని ఆయన తెలిపారు.  అయితే ఇందుకు గాను అదనంగా పోస్టులను మంజూరు చేయాల్సిన పని లేదని, ప్రస్తుతం మంజూరు కాబడిన క్యాడర్ స్ట్రెంగ్తు  అధికారులతోనే ఈ పోస్టులను సర్థుబాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. 

హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా... 
రాష్ట్రంలో  గ్రేడ్-1,2 & 3 దేవాలయాలు ఉండేవని, హైకోర్టు ఆదేశాల మేరకు రూ.5 లక్షలలోపు ఆదాయం ఉండే దేవాలయాల నుండి ఎగ్జిక్యూటివ్ అధికారులను ఉపసంహరించనున్నట్లు తెలిపారు. అటు వంటి ఆలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణ, భూముల వేలం తదితర కార్యక్రమాలను స్థానికంగా ఉండే దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అయితే ఆ దేవాలయాల నిర్వహణ కార్యక్రమాలను అర్చకులు గాని లేదా దేవాలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గాని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయో పున సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget