అన్వేషించండి

CRDA Meeting: క్వాంటం వ్యాలీలో అత్యాధునిక పరికరాల కోసం ఒక ప్రత్యేక భవనం - సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్

Quantum Valley: 'క్వాంటం వ్యాలీ'లో అత్యాధునిక పరికరాల కోసం ఓ భవనాన్ని నిర్మించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP CRDA construct special building in Quantum Valley : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ** 65వ సీఆర్డీయే (CRDA) అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయించారు.  
 
అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా 'క్వాంటం వ్యాలీ'లో అత్యాధునిక పరికరాల  కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. రెండు ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 43,000 చదరపు అడుగుల్లో  103.96 కోట్ల రూపాయలతో  ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయడమే కాకుండా, క్వాంటం వ్యాలీలో మరో రెండు అదనపు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.                   

అమరావతికి భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా చేసేందుకు భారీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు పనులతో పాటు, గుంటూరు ఛానల్ ద్వారా అదనంగా 4 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను 443 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే LPS జోన్ 8లో మౌలిక సదుపాయాల కోసం 1,351 కోట్లు మంజూరు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.  కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో భారీ ఆసుపత్రి, యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం 60 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు  750 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం ఇక్కడ వైద్య సేవలను అందుబాటులోకి తేనుంది. దీనితో పాటు ఐఏఎస్ అధికారుల బంగ్లాల ఇంటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం  109.52 కోట్లు విడుదల చేయడానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.                                  

రాజధాని ప్రాంతంలోని రైతులకు సంబంధించిన జరీబ్, నాన్ జరీబ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ సమస్యల పరిశీలన కోసం జిల్లా స్థాయి అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా అథారిటీ ఆమోదించింది.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget